ముందు చూపు కొరవడి.. ముంపు ప్రాంతాల్లో నిర్మించి..
సంగారెడ్డి మండలం కొత్లాపూర్ పోచమ్మకుంట శిఖంలో వైకుంఠధామం నిర్మించారు. ఇందుకోసం రూ.12 లక్షలు వెచ్చించారు. ప్రస్తుతం కుంట పూర్తిగా నిండి, శ్మశానవాటికలోకి చేరింది. ఇక్కడ ఇప్పటి వరకు అంత్యక్రియలు నిర్వహించలేదు. స్నానపు గదులకు పలు చోట్ల పగుళ్లు రావడంతో సిమెంట్ పూశారు.
అస్తవ్యస్తంగా వైకుంఠధామాల నిర్మాణం
* సంగారెడ్డి మండలం కొత్లాపూర్ పోచమ్మకుంట శిఖంలో వైకుంఠధామం నిర్మించారు. ఇందుకోసం రూ.12 లక్షలు వెచ్చించారు. ప్రస్తుతం కుంట పూర్తిగా నిండి, శ్మశానవాటికలోకి చేరింది. ఇక్కడ ఇప్పటి వరకు అంత్యక్రియలు నిర్వహించలేదు. స్నానపు గదులకు పలు చోట్ల పగుళ్లు రావడంతో సిమెంట్ పూశారు.
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్, గుమ్మడిదల, కంగ్టి ,మునిపల్లి
* కంగ్టి మండలం జమ్గిలో గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో కట్టడం వల్ల ఇప్పటి వరకు వినియోగంలోకి రాలేదు. అక్కడికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదు. ఇదే మండలం దెగుల్ వాడిలో ఇదే పరిస్థితి నెలకొంది. తుర్కవాడగావ్, రాంతీర్థ్ గ్రామాలకు దూరంగా నిర్మించారు. ఇప్పటి వరకు వాటిని వినియోగించలేదు.
* గుమ్మడిదల మండలం రాంబాయిలోని దయ్యాలకుంటలో వైకుంఠధామం నిర్మించారు. వర్షా కాలంలో ఎవరైనా మృతి చెందితే నీళ్లలోనుంచి వెళ్లాల్సి వస్తోంది. అనువుగాని చోట కట్టడం వల్ల ఇబ్బందులు తప్పడంలేదని పలువురు వాపోతున్నారు.
* మునిపల్లి మండలం గార్లపల్లి గ్రామశివారులో శ్మశానవాటికి నిర్మించారు. ముంపు ప్రాంతం కావడం వల్ల సింగూర్ ప్రాజెక్టు నీరు వస్తోంది. వేసవిలోనూ ఇక్కడ నీరు ఉండటంతో ప్రయోజనం లేకుండా పోయింది.
ఇలా జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి దుస్థితి నెలకొంది. పల్లెల్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు పడుతున్న అవస్థలను దూరం చేయాలన్న సంకల్పంతో సర్కారు శ్మశాన వాటికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే స్థానిక అధికారులు అనువైన ప్రాంతాలను ఎంపిక చేయలేదు. దీంతో లక్ష్యం నెరవేరడంలేదు. ప్రస్తుతం వాటి పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడో ఒక చోట నిర్మిద్దామనే ఆలోచన తప్ప, ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్న విషయాన్ని విస్మరించారు. చాలా చోట్ల చెరువు, కుంటల శిఖం భూముల్లో కట్టారు. వీటి వల్ల గుత్తేదారులకే మేలు జరిగిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో వ్యాప్తంగా ఊరూరా వైకుంఠధామాలు నిర్మాణాలు పూర్తి చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద పనులు చేపట్టారు. ఒక్కో దానికి రూ.లక్షలు వెచ్చించారు. మొట్ట మొదటి సారిగా కంది మండలం చెర్లగూడెంలో ఓ వైకుంఠధామం పనులను 2017లో పూర్తి చేశారు. అదే స్ఫూర్తితో... 2019లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్మాణాల స్థల సేకరణ నుంచి సౌకర్యాలు కల్పించేందుకు పంచాయతీ రాజ్ (పీఆర్ ), రెవెన్యూ, పోలీస్ శాఖల భాగస్వామ్యంతో నిర్మాణాలు చేపట్టారు. అందులో రెండు స్నానాల గదులు, వెయింటింగ్ హాల్ , కార్యాలయం గది, దుస్తులు మార్చుకునేందుకు పురుషులకు, స్త్రీలకు అందులోనే అటాచ్డ్ శౌచాలయం నిర్మించినా, చాలా చోట్ల స్థానికులకు వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోవడం గమనార్హం..
గుమ్మడిదల మండలం రాంబాయి కుంటలో ఇలా..
ఎంపీడీవోలదే పూర్తి బాధ్యత : సీ.హెచ్. శ్రీనివాస్రావు, డీఆర్డీఓ.
జిల్లాలో వైకుంఠధామాల నిర్మాణాలకు సంబంధించి ఎంపీడీవోలదే పూర్తి బాధ్యత. స్థానికంగా ప్రజలకు ఉపయోగపడే చోట నిర్మించాలని ఆదేశాలిచ్చాం. నీటి వనరుల శిఖం భూముల్లో కట్టినవి, అసంపూర్తిగా ఉన్నవాటి గురించి వివరాలను తెప్పించుకుంటాం. ప్రజలకు ఉపయోగ పడకుండా నిరుపయోగంగా ఉండటం సరికాదు. వినియోగించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాం.
జిల్లాలో ఇలా..
పంచాయతీలు: 647
పూర్తయిన శ్మశాన వాటికలు 647
వెచ్చించిన నిధులు రూ.77.80 కోట్లు
ఒక్కోదానికి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM