కన్నీటి.. పొలం!
వానాకాలంలో పంటలు సాగు చేసిన రైతుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. పలుచోట్ల పత్తి, మొక్కజొన్న, కూరగాయాల పంటలు నీట మునిగిపోయి దెబ్బతిన్నాయి.
పత్తి, మొక్కజొన్నకు తీవ్ర నష్టం
న్యూస్టుడే, గజ్వేల్, మిరుదొడ్డి
రిమ్మనగూడలో దెబ్బతిన్న పత్తి పంట ఇలా..
వానాకాలంలో పంటలు సాగు చేసిన రైతుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. పలుచోట్ల పత్తి, మొక్కజొన్న, కూరగాయాల పంటలు నీట మునిగిపోయి దెబ్బతిన్నాయి. వేలకు వేలు పెట్టుబడి పెట్టిన రైతులు పాడైన పంటలను చూసి కన్నీమున్నీరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో దాదాపు 5.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 2.50 లక్షల ఎకరాల్లో వరి, 2 లక్షల ఎకరాల్లో పత్తి, 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 30 వేల ఎకరాల్లో కందితో సహా ఇతర పంటలు సాగవనున్నాయని ప్రతిపాదించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియటంతో పంటలు అతలాకుతలం అయ్యాయి. వరి మినహాయిస్తే ఇతర పంటలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నల్లరేగడి అధికంగా ఉన్న గజ్వేల్, జగదేవపూర్, మిరుదొడ్డి, వర్గల్, కొండపాక, చేర్యాల పరిసర ప్రాంతాల్లో పత్తి, మొక్కజొన్న పొలాల్లో వాననీరు వీడటం లేదు. వారాల తరబడి అలాగే ఉండిపోవటంతో మొక్కలు కళ్లిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇప్పటిదాకా 600 ఎకరాల్లో ఉద్యాన పంటలు, 2 వేల ఎకరాలకుపైగా పత్తి, 1,300 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. ఈ లెక్కన దాదాపు రూ.40 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి.. పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ప్రజ్ఞాపూర్లో మొక్కజొన్న తీరు..
కొంత దెబ్బతిన్నా.. వదలొద్దు
- శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి
అధిక వర్షాలతో నీరు చేరిన పంటలకు సంబంధించి మళ్లీ ఎండ కాస్తే ఎదుగుతాయి. కొంత మేర దెబ్బతిన్నా మిగిలిన పంటను వదిలిపెట్టకుండా మెలకువలతో పాటించి కాపాడుకోవాలి. సగటున 33 శాతానికి మించి పంటలు పాడైనట్లు మాకు ఎలాంటి నివేదిక రాలేదు. ఈమేరకు పంట నష్టం అంచనా అవకాశాలు లేవు. జిల్లా వ్యాప్తంగా తమ శాఖ అధికారులు పర్యటిస్తూ రైతులకు మనోధైర్యాన్ని చెబుతూ.. సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
- బాలరాజు, రిమ్మనగూడ, గజ్వేల్ మండలం
నాలుగు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశా. ఇప్పటిదాకా మొత్తం రూ.50 వేలు పెట్టుబడికి వ్యయం చేశా. భారీ వర్షాలతో పంట నీట మునిగింది. ఇప్పటికీ చాలా వరకు నీళ్లు ఉన్నాయి. దిగుబడి చేతికి వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి.
గతంలో ఎప్పుడూ ఇలా చూడలే..
నాగులు, ధర్మారం, మిరుదొడ్డి మండలం
రూ.55 వేల పెట్టుబడి పెట్టి నాలుగు ఎకరాల్లో పత్తి వేశా. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పాడైపోయింది. అక్కడక్కడ మిగిలిన మొక్కలతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అధిక వర్షాలతో ఇంతగా పాడైంది ఎప్పుడూ చూడలే. ఈసారి లాభాలు వస్తాయని ఆశిస్తే ఇలా జరిగింది. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేయించి.. పరిహారం ఇవ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!