ఇక ఈ-వాహన ఛార్జింగ్ కేంద్రాలు...
తరచూ పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలపై పలువురు చోదకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో వాహనాలు కొనుగోలు చేస్తున్న పలువురు ఇంటి వద్ద
ఇరు జిల్లాల్లో ఏర్పాటుకు కసరత్తు
న్యూస్టుడే, సిద్దిపేట
తరచూ పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలపై పలువురు చోదకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో వాహనాలు కొనుగోలు చేస్తున్న పలువురు ఇంటి వద్ద ఛార్జింగ్ చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఆ ఇబ్బందులు తీరనున్నాయి. టీఎస్రెడ్కో (తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరు అభివృద్ధి సంస్థ) నేతృత్వంలో ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది. ఫలితంగా ఛార్జింగ్ వాహనాలను సులువుగా ఛార్జ్ చేసుకునే సదుపాయం చేరువ కానుంది. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో మొత్తం 31 ప్రాంతాల్లో కేంద్రాలు అందుబాటులోకి వచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో టీఎస్రెడ్కో నేతృత్వంలో ఈ-వాహన ఛార్జింగ్ కేంద్రాలను సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో త్వరలో ఏర్పాటు దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇరు జిల్లాల్లో ప్రభుత్వ శాఖల సమన్వయంతో స్థలపరిశీలన పూర్తి చేసి రాష్ట్ర కార్యాలయానికి ప్రతిపాదించారు. క్షేత్రస్థాయిలో సర్వే అనంతరం ఖరారు చేసి కంపెనీలను ఆహ్వానించనున్నారు. ఇరు జిల్లాల్లో జాతీయ, రాజీవ్, ప్రధాన రహదారులను ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేయనున్నారు. రెవెన్యూ, పౌరసరఫరాలు, ర.భ., పర్యాటక శాఖ సహకారంతో శాఖల పరిధిలో స్థలాలను గుర్తించారు. సిద్దిపేట జిల్లాలో తొలుత 17 కేంద్రాల ఏర్పాటుకు సంకల్పించారు. అందులో పౌరసరఫరాలకు సంబంధించిన స్థలాలు - 6, పర్యాటక - 3, రెవెన్యూ - 6, ర.భ. - 2 ఉన్నాయి. మెదక్ జిల్లాలో 14 ఏర్పాటు చేయనుండగా.. పౌరసరఫరాలు - 6, ర.భ. శాఖ సంబంధిత 8 స్థలాల్లో ఏర్పాటు కానున్నాయి. ఒక్కో చోట 300 - 1000 చదరపు గజాల వరకు ప్రతిపాదించారు.
మూడు నెలల్లోగా..
సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఒకప్పటితో పోల్చితే ఈ-వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. రెండేళ్లుగా ఈ మార్పు కనిపిస్తోంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతరత్రావి దాదాపు 2 వేలకు పైగా ఉన్నాయి. కేంద్రాలు రానుండటంతో వాహన ఛార్జింగ్ ప్రక్రియ సులువుగా మారనుంది. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట కోమటిచెరువు, బూరుగుపల్లి, ఇర్కోడు, దౌల్తాబాద్, తిమ్మాపూర్, తొగుట, గజ్వేల్, నంగునూరు, చిన్నకోడూరు మండలం మెట్టుపల్లి, మల్లారం, ప్రజ్ఞాపూర్ (హరిత హోటల్), నాగులబండ వద్ద ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి సమీపంలో, ములుగు, లకుడారం, పందిళ్ల, బస్వాపూర్, తోటపల్లిలో స్థలాల గుర్తింపు పూర్తయింది. మెదక్ జిల్లాలో పాపన్నపేట, శంకరంపేట (ఏ), నర్సాపూర్, తూప్రాన్, చేగుంట, రామాయంపేటలో ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇప్పటికే టీఎస్రెడ్కో రాష్ట్ర కార్యాలయం ఐవోసీఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంలో స్థలాలకు సంబంధించిన శాఖలు లేదా యజమానులకు కొంత మేర చెల్లించనున్నారు. వచ్చే మూడు నెలల్లో కేంద్రాలు అందుబాటులోకి తెచ్చేందుకు సంబంధిత విభాగం అధికారులు శ్రమిస్తున్నారు.
అరగంట నుంచి గంటలోపు..
ఛార్జింగ్ను యూనిట్ చొప్పున విక్రయించనున్నారు. ఒక్కో యూనిట్కు రూ.18 నుంచి 20 వరకు వెచ్చించనున్నట్లు సమాచారం. ద్విచక్ర వాహనాల్లో 3 నుంచి 4 యూనిట్లు, కారుకు 75 యూనిట్ల వరకు ఛార్జింగ్ చేసే అవకాశం ఉండనుంది. బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా అర గంట నుంచి గంటలోపు ఛార్జింగ్ చేయనున్నారు. ఆయా చోట్ల అనుమతులు పూర్తయితే 30 కిలో వాట్స్, 60 కిలో వాట్స్ సామర్థ్యంతో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఇరు జిల్లాల టీఎస్రెడ్కో మేనేజర్ రామ్మోహన్ ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన, తక్కువ ధరకే నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఈ-వాహన ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్