మొక్కుబడి.. హడావిడి!
యువకులు, చిన్నారులను ఆటల వైపు మళ్లించాలి. వారిని శారీరకంగా, మానసికంగా బలిష్టులుగా తీర్చిదిద్దాలి. తెలంగాణ క్రీడా ప్రాంగణాల లక్ష్యమిదే. అయితే క్షేత్రస్థాయిలో వాటిని ఏర్పాటు చేస్తున్న తీరు ఈ లక్ష్యాన్ని చేరుకుంటామనే భరోసా కలిగించడం
క్రీడాపాంగణాల ఏర్పాటులో ఇదీ తీరు
ఈనాడు, సంగారెడ్డి, న్యూస్టుడే, చేర్యాల, సిర్గాపూర్, నర్సాపూర్
సంగారెడ్డి పురపాలిక పరిధి చాణక్యపురికాలనీలో నామమాత్రంగా ఏర్పాటు ఇలా..
యువకులు, చిన్నారులను ఆటల వైపు మళ్లించాలి. వారిని శారీరకంగా, మానసికంగా బలిష్టులుగా తీర్చిదిద్దాలి. తెలంగాణ క్రీడా ప్రాంగణాల లక్ష్యమిదే. అయితే క్షేత్రస్థాయిలో వాటిని ఏర్పాటు చేస్తున్న తీరు ఈ లక్ష్యాన్ని చేరుకుంటామనే భరోసా కలిగించడం లేదు. కేవలం లెక్కల కోసం.. ఉన్నతాధికారులకు చెప్పేందుకే హడావుడిగా బోర్డులు పాతి... చిన్న పనులు చేసి మమ అనిపిస్తున్నారు. చాలా చోట్ల భూమిని చదును కూడా చేయడం లేదు.
నాలుగు రాడ్లు పాతేస్తున్నారు
ఉమ్మడి మెదక్ జిల్లాలోని చాలా క్రీడా ప్రాంగణాలను పరిశీలిస్తే... కేవలం కొంత మట్టిని చదును చేసి.. కసరత్తు చేసేందుకు వీలుగా నాలుగు ఇనుపరాడ్లు పాతేశారు. ఆటలు ఆడేందుకు పూర్తిగా ఈ ప్రాంగణాన్ని సిద్ధం చేయడం లేదు. భూమిని మంచిగా చదును చేయాలి. ఖోఖో, వాలీబాల్, కబడ్డీ కోర్టులు ఏర్పాటు చేయాలి. లాంగ్జంప్ పిట్ నిర్మించాలి. వీటిని పూర్తిస్థాయిలో పాటించడం లేదు. ఉన్నతాధికారులు ఈ పనులపై ప్రత్యేక దృష్టిసారిస్తేనే ప్రయోజనముంటుంది.
* సిద్దిపేట జిల్లాలో 528 ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని అంచనా రూపొందించారు. ఇప్పటికే దాదాపు 240 వరకు అందుబాటులోకి తెచ్చామంటున్నారు. వినియోగం ఆ స్థాయిలో లేదు.
* మెదక్ జిల్లాలో 550 లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 73 చోట్ల పనులు పూర్తయినట్లు చెబుతున్నారు. 40 ప్రాంగణాలను ప్రారంభించారు.
* సంగారెడ్డి జిల్లాలోని పురపాలికల్లో 199 నిర్మించాలి. ఇప్పటి వరకు 60చోట్ల పనులు పూర్తయ్యాయి. కేవలం 19 మాత్రమే ప్రారంభించారు. వీటిలో చాలా వరకు ఆటలు ఆడటానికి అనువుగా లేవు. జిల్లాలోని గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో కలిపి 734 లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 384 పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.
లక్ష్మణ్నాయక్తండాలో పూర్తికాని పనులు
క్షేత్రస్థాయిలో పరిస్థితి..
* సంగారెడ్డి పురపాలిక చాణక్యపురికాలనీలో కసరత్తు చేసే వీలుగా నామమాత్రంగా పనులు చేపట్టారు. గతంలో హరితహారంలో నాటిన మొక్కలు ఇక్కడ పెరగలేదు. ఇప్పుడు ఆ ప్రదేశంలోనే క్రీడా ప్రాంగణం అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు రూ.2.5లక్షలు ఖర్చుచేసినట్లు అధికారులు చెబుతున్నా, ఎవరూ వినియోగించని పరిస్థితి.
* మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలిక పరిధిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో ప్రైవేటు వాహనాలను అధిక సంఖ్యలో నిలుపుతుంటారు. దీనిని క్రీడా ప్రాంగణానికి ఎంపిక చేశారు. ఇక్కడా అదే పరిస్థితి. నాలుగు రాడ్లు పాతారు. బోర్డు పెట్టారు. ఇతర ఏ పనులూ చేపట్టలేదు.
* సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలలో వాలీబాల్ కోసం రెండు రాడ్లు పాతారు. ఖోఖో ఆడేందుకు రెండు రాడ్లు బిగించారు. కనీసం భూమి చదును చేయలేదు. కనీసం ఈ పని చేయలేదని క్షేత్రస్థాయికి వెళ్లి చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు రూ.4.50లక్షల వరకు నిధులు వెచ్చించామంటున్నారు. ఇది గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరం ఉంది. పూర్తిస్థాయిలో పనులు చేసినా ఇక్కడొచ్చి ఆడుకోవడమనేది కష్టమే.
* సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం లక్ష్మణ్నాయక్తండాకు సమీపంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం. రూ.3.60లక్షల అంచనాతో పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు కొన్ని పనులు మాత్రమే చేశారు. మిగతా పనులేవీ పూర్తికాకపోయినా, బోర్డును ముందే ఏర్పాటు చేశారు. మిగతా చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి.
చేర్యాల మండలం ముస్త్యాలలో..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడులకు నిర్వహణ నిధులు
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించి రెండో విడత నిధులు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత 50శాతం నిధులు గత ఏడాది జులైలో ప్రభుత్వం విడుదల చేసింది. -
కొత్త రేషన్కార్డులకు.. కోడ్ అడ్డంకి
[ 28-03-2024]
ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొందరికే ఇవి ఉండగా, చాలా మందికి లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కేవలం పథకాలే కాకుండా వైద్య సేవలు పొందే అవకాశం లేక ఆర్థికభారం పడుతోంది. -
సర్పంచి నుంచి.. ఎంపీ అభ్యర్థిగా..
[ 28-03-2024]
సేవా కార్యక్రమాల నిర్వహణతో రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న ఆయనను ఎంపీ టికెట్ వరించింది. ఏకంగా జాతీయ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కలిగింది. కాంగ్రెస్లో చేరిన కొద్దిరోజులకే ఎంపీ టికెట్ పొందడం గమనార్హం. -
గడువు ముంగిట పనుల హడావుడి
[ 28-03-2024]
పల్లెల్లో మట్టి దారులను సీసీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేస్తోంది. ఇందుకోసం గత నెల తొలి వారంలో ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెలాఖరుకు గడువు విధించారు. -
కార్మికులకు గుర్తింపు.. పథకాలతో ప్రయోజనాలు
[ 28-03-2024]
కార్మికులకు తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి జారీ చేసే గుర్తింపు కార్డులు చాలా ముఖ్యం. దీంతో సంఘంలో గుర్తింపు పాటు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. -
విద్యార్థులకు ప్రేరణ
[ 28-03-2024]
ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లోని సృజనను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రేరణ పేరుతో వారికి ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
ఈత కొలను తెరవరా?
[ 28-03-2024]
సిద్దిపేటలోని ఈత కొలను నిర్వహణ కొరవడుతోంది. నిత్యం కొనసాగించాల్సిన ఈ కొలను.. వేసవి ఆరంభమైన ఇంకా తెరవడం లేదు. ఆరేళ్ల కిందట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ రూ.5 కోట్ల వరకు ప్రభుత్వ నిధులు వెచ్చించి అందుబాటులోకి తెచ్చారు. -
అరచేతిలో లక్షల పుస్తకాలు
[ 28-03-2024]
ఉద్యోగ ప్రకటనలు వెలువడటంతో నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు. గ్రంథాలయాలు, కోచింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉద్యోగ సాధనే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. -
స్పందించండి.. సంధించండి
[ 28-03-2024]
ప్రజలు రాకపోకలు సాగించేటపుడు దారిలో అనేక సంఘటనలు చూస్తుంటారు. కొన్ని హృదయవిదారకంగా, ఎలాగైనా సాయం చేయాలనిపించేలా.. ఇంకొన్ని అన్యాయంగా, అక్రమంగా.. అగుపిస్తాయి. బిజీ జీవితమైనా ఉత్తమ పౌరులుగా స్పందించాలనిపిస్తుంది. -
మహిళాభ్యున్నతికి సహకారం
[ 28-03-2024]
సహకార బ్యాంకులు మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైౖతులకు రుణాలు ఇవ్వడం..వసూలు చేయడానికి ఇవి గతంలో పరిమితమయ్యేవి. ఇప్పుడు మహిళలు అర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడంలోనూ ముందుంటున్నాయి. -
దాత ఔదార్యం.. భక్తులకు సౌకర్యం
[ 28-03-2024]
వారి కులదైవమంటే ఆ దంపతులకు చాలా నమ్మకం. సొంత ఖర్చుతో దైవానికి ఆలయం నిర్మించారు. సరైన దారి లేక దర్శనానికి ఇబ్బంది పడుతున్న విషయం గమనించి తాజాగా వంతెన నిర్మిస్తున్నారు. -
ఆస్తి కోసం చిన్నమ్మనే కడతేర్చాడు
[ 28-03-2024]
ఈనెల 21న టేక్మాల్ మండలం తంపులూరులో హత్యకు గురైన మహిళను ఆమెకు వరుసకు కొడుకయ్యే వ్యక్తే చంపినట్లు పోలీసులు గుర్తించారు. టేక్మాల్లో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి బుధవారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. -
నిండు మనసుతో ఆశీర్వదించండి
[ 28-03-2024]
ఈ ప్రాంత ప్రజాసమస్యలపై లోతైన అవగాహన ఉందని, ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించాలని మెదక్ పార్లమెంట్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోరారు. సిద్దిపేటలో పార్టీ శ్రేణుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. -
మాజీ కలెక్టర్కు వేల కోట్లు ఎక్కడివి?
[ 28-03-2024]
భారాస మెదక్ లోక్సభ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు.డిమాండ్ చేశారు. -
భారాస విజయం తథ్యం: కొత్త ప్రభాకర్రెడ్డి
[ 28-03-2024]
మెదక్ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించటం తథ్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్లో మాట్లాడుతూ.. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక