మెరుగైన వైద్యం.. ఆరోగ్య భాగ్యం
గతంలో సర్కారు దవాఖానాల్లో సరైన సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెరుగైన వైద్యం అందడం గగనమే. రానురాను పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించడం, సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో నాణ్యమైన
ఆసుపత్రుల అభివృద్ధి, ఆధునికీకరణ
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్
గతంలో సర్కారు దవాఖానాల్లో సరైన సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెరుగైన వైద్యం అందడం గగనమే. రానురాను పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించడం, సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో నాణ్యమైన సేవలకు బాటలు పడ్డాయి. ఒకప్పుడు ప్రధాన పట్టణాలకే పరిమితమైన ఆసుపత్రులు, నేడు పల్లె ముంగిటకు వచ్చాయి. ప్రత్యేక పథకాలు అమలు చేయడంతోపాటు వసతులు కల్పించడంతో ఆదరణ పెరుగుతోంది. వజ్రోత్సవం వేళ వైద్య రంగంలో వచ్చిన మార్పులు, స్థితిగతులపై ప్రత్యేక కథనం.
వార్డులో చికిత్స
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మొదట 250 పడకల ఆసుపత్రి ఉండేది. అనంతరం 150 పడకలతో తల్లీబిడ్డల సంరక్షణకు మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఉమ్మడి జిల్లా వాసులతోపాటు సమీపంలోని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా వాసులు వచ్చి చికిత్స పొందుతుంటారు. గతేడాది ఈ ఆసుపత్రికి వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల మంజూరయ్యాయి. ఐసీయూ, రక్తశుద్ధి, వెల్నెస్ కేంద్రం ద్వారా సేవలు అందిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు పాలియేటివ్ కేర్ సెంటర్ ఉంది. హైదరాబాద్కు, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లడం నుంచి విముక్తి లభించింది.
మార్పులు ఇలా...!...
* పల్లె, బస్తీ దవాఖానాలుగా ఏర్పాటు చేసి వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. పట్టణాల్లో 5వేల జనాభా ఉన్న వార్డులకు ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా 642 ఆరోగ్య ఉపకేంద్రాల్లో విభజన చేసి, 22 ఆసుపత్రులను పల్లె దవాఖానాలుగా ఏర్పాటు చేశారు. గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రంగా సంగారెడ్డిలో రెండు ఉండేవి. వాటి స్థాయి పెంచారు. పటాన్చెరులో, జహీరాబాద్లో పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి.
పీహెచ్సీల నుంచి సీహెచ్సీలుగా ...
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా స్థాయి పెంచారు. వాటిలో సదాశివపేట, మిర్జాపూర్, కరాస్ గుత్తి, కోహీర్, కల్హేర్ సీహెచ్సీలుగా మార్చారు. ఆరుపడకల నుంచి 30పడకలకు స్థాయిపెంచారు. జోగిపేట, నారాయణఖేడ్, పటాన్చెరు, జహీరాబాద్ ఆసుపత్రులలో 50 పడకల నుంచి 100 పడకలకు స్థాయి పెంచి, ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు.
ఝరాసంగంలో కార్పొరేట్ హంగు
తల్లీబిడ్డలకు భరోసా
కేసీఆర్ కిట్టు, అమ్మఒడి, 102 సేవలు అందిస్తున్నారు. సంగారెడ్డిలో 150 పడకలు మాతాశిశు సంరక్షణ కేంద్రం ఉంది. నారాయణఖేడ్లో ఎంసీహెచ్ భవనం పనులు సాగుతున్నాయి. జహీరాబాద్లో 50 పడకల భవనం నిర్మాణానికి రూ.7.05 కోట్ల నిధులు ఇటీవల మంజూరయ్యాయి. సంగారెడ్డిలో 20 పడకలతో నవజాత శిశు కేంద్రం కొనసాగుతోంది. అత్యవసరంలో వైద్యం అందించేందుకు పది పడకల ఐసీయూ వినియోగంలోకి వచ్చింది. అంతేగాకుండా పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులను చేరదీసేందుకు పునర్జీవన కేంద్రంలో 10 పడకలు ఏర్పాట్లు చేశారు. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 100పడకల నుంచి 200పడకలకు పెంచనున్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో టీ-హబ్ సేవలు అందుతున్నాయి. ఇక్కడ 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నాలుగు రూట్లుగా రెండ వాహనాల ద్వారా ఆయా పీహెచ్సీల నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నారు.
రక్తశుద్ధి కేంద్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!