ఆర్టీసీ ఆదాయానికి అడ్డంకులు!
సిద్దిపేట జిల్లాలో పలు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల సమీపంలో నిలిపి ఉంచుతున్న ప్రైవేట్ వాహనాల జోరుతో ఆర్టీసీ ఆదాయం తగ్గిపోతుంది. దుబ్బాక పట్టణంలో 1998లో 54 బస్సులతో ఏర్పడిన ఆర్టీసీ డిపో, రాన్రాను ప్రైవేట్
దుబ్బాక బస్టాండ్ ముందు నిలిపిన తీరు
దుబ్బాక, న్యూస్టుడే: సిద్దిపేట జిల్లాలో పలు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల సమీపంలో నిలిపి ఉంచుతున్న ప్రైవేట్ వాహనాల జోరుతో ఆర్టీసీ ఆదాయం తగ్గిపోతుంది. దుబ్బాక పట్టణంలో 1998లో 54 బస్సులతో ఏర్పడిన ఆర్టీసీ డిపో, రాన్రాను ప్రైవేట్ వాహనాల పోటీని తట్టుకోలేక, ప్రస్తుతం 33 బస్సులతో ఆపసోపాలు పడుతోంది. నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. దుబ్బాకలో 40 ఏళ్ల క్రితం నిర్మించిన బస్టాండు శిథిలావస్థకు చేరింది. కొత్తదానికి శంకుస్థాపన గత జులైలో చేశారు. నూతన బస్టాండ్ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలోనే ఆర్టీసీ ప్రయాణికుల కోసం బస్సులను ప్రధాన రహదారి ముందు నిలిపి ఉంచుతున్నారు. దానికి ఎదురుగా, కుడివైపు, ఎడమ వైపు ప్రైవేటు వాహనాలు నిలుపుతున్నారు. రహదారి ఇరుకుగా మారుతోంది. నిబంధనల ప్రకారం బస్టాండు ఆవరణకు 250 మీటర్ల దూరం వరకు ప్రైవేటు వాహనాలు నిలపకూడదు. ఈ విషయాన్ని సూచిస్తూ హెచ్చరిక బోర్డును బస్టాండు ముందు ప్రదర్శనగా ఉంచారు. అయినా వాహనాల పార్కింగ్ ఆగడం లేదు. ఈ పార్కింగ్ తీరుపై ఆర్టీసీ సిబ్బందికి, ఇతర వాహనాల యజమానులకు మధ్య గొడవలు జరిగాయి. తొందరగా గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీకి ఆదాయం గండి పడుతోంది. ప్రస్తుతం దుబ్బాక బస్టాండ్లో ఆర్టీసీ సిబ్బంది మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. గతంలో ఈ డిపో నుంచి తిరుపతి, శ్రీశైలం, బోధన్, సంగారెడ్డి, వరంగల్ తదితర సుదూర సర్వీసులను నడిపారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి సికింద్రాబాద్, సిద్దిపేట, గజ్వేల్కు మాత్రమే నడుపుతున్నారు. ఇతర వాహనాల పార్కింగ్ను నియంత్రించాలని కోరుతూ గత మే 18న సిద్దిపేట డిపో మేనేజర్, దుబ్బాక ఇన్ఛార్జి కిషన్రావు స్థానిక సీఐ కృష్ణకు ఫిర్యాదు అందజేశారు. స్పందించిన సీఐ పట్టణంలోని వాహనాల డ్రైవర్లు, వాహనదారులతో రెండు సార్లు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 20 ఏళ్లుగా బస్టాంండ్ ప్రాంతాల్లోనే వాహనాలను నిలుపుతున్నామని.. అకస్మాత్తుగా తొలగించమంటే ఎలా అని.. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగి తాము సతమతమవుతున్నామని సమావేశాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో తమ వాహనాలకు అనువైన పార్కింగ్ స్థలాన్ని చూపించాలని వాహనదారులు కోరారు.
ప్రైవేటు వాహనాలు నిలపొద్దని సూచించే హెచ్చరిక బోర్డు ఉన్న చోటే ఇలా..
అనువైన స్థలం చూపించి... తగిన చర్యలు తీసుకుంటాం
- మున్నూరు కృష్ణ, సీఐ, దుబ్బాక
గతంలో వాహనదారులతో సమావేశమై నిబంధనల ప్రకారం దూరంగా వాహనాలను నిలపాలని సూచించాం. పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. త్వరలోనే పురపాలిక అధ్యక్షురాలు, కమిషనర్తో మాట్లాడి, అనువైన స్థలం చూపించి, పరిష్కరిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం