సైబర్ నేరాల నియంత్రణకు అంబాసిడర్లు..!
రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఆన్లైన్లో బురుడీ కొట్టించి.. వివరాలను సేకరించి.. దోచుకుంటున్నారు. తీరా మోసపోయామని భావించిన వారు ఠాణా మెట్లు ఎక్కుతున్నారు. ఈ తరహా మోసాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కొరవడటంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది
న్యూస్టుడే, మెదక్
ఇటీవల పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లిలో ఆన్లైన్ మోసాలపై వివరిస్తున్న విద్యార్థిని
రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఆన్లైన్లో బురుడీ కొట్టించి.. వివరాలను సేకరించి.. దోచుకుంటున్నారు. తీరా మోసపోయామని భావించిన వారు ఠాణా మెట్లు ఎక్కుతున్నారు. ఈ తరహా మోసాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కొరవడటంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టింది. పోలీస్, విద్యాశాఖల సమన్వయంతో విద్యార్థులను అంబాసిడర్లుగా ఎంపిక చేసి తర్ఫీదు ఇచ్చారు. పది నెలల పాటు శిక్షణ పొందిన వారు ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించనున్నారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా సైబర్ నేరస్థులు మోసాలకు పాల్పడుతున్నారు. చరవాణికి ఫోన్ చేసి ఆధార్, పాన్కార్డు అప్డేట్ చేయాలని, బ్యాంక్ ఖాతా వివరాలు, బహుమతులు వచ్చాయని చెబుతూ ఖాతాల్లోని నగదు మాయం చేస్తున్నారు. ఇలాంటి వాటిపై పోరు సాగించి నేరగాళ్ల ఆటకట్టించడానికి పోలీస్, విద్యాశాఖలు నడుం బిగించాయి.
తొలి విడత 51 పాఠశాలల్లో..
జిల్లాలో ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సైబర్ కాంగ్రెస్ పేరిట ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇద్దరు విద్యార్థులను అంబాసిడర్లుగా ఎంపిక చేశారు. వీరికి ఒక ఉపాధ్యాయుడిని మెంటార్గా నియమించారు. జిల్లాలో తొలి విడతలో 51 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. వీరికి గతేడాది నుంచి వర్చువల్ విధానంలో శిక్షణ ఇచ్చారు. ఇకపై వారు తోటి విద్యార్థులకు, పాఠశాల పరిసరాల్లోని గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.కేవలం సైబర్ మోసాల గురించి కాకుండా మహిళలు, చిన్నారులకు జరుగుతున్న వేధింపుల విషయంలో అప్రమత్తంగా ఉండడం, డయల్ 100తో పాటు, సైబర్ హెల్ప్లైన్ 1930, చిల్డ్రన్ హెల్ప్లైన్ 1098 వివరాలపై చైతన్యం తీసుకురానున్నారు.
అవగాహనతోనే అడ్డుకట్ట..
- బాలస్వామి, జిల్లా అదనపు ఎస్పీ
చరవాణులు, ఆన్లైన్ వేదికల వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. మహిళలు, పిల్లలే లక్ష్యంగా మోసాలు జరుగుతున్నాయి. వాటిని నియంత్రించేందుకు పాఠశాలల్లో అంబాసిడర్లను ఎంపిక చేసి తర్ఫీదు ఇచ్చాం. సైబర్ కాంగ్రెస్ ద్వారా నేరాల నియంత్రణతో పాటు, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు