నీటి వనరుల బాగే లక్ష్యంగా..
గత మేలో తొలి విడత పనులు మొదలయ్యాయి. ఇప్పటికే చెరువులు, కుంటల బలోపేతానికి శ్రీకారం చుట్టాం. ఈనెల 15 నాటికి 20 శాతం పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పనులు పూర్తయిన చోట జెండావిష్కరణ చేపడతాం. ఈ పథకంతో అన్నదాతలకు ప్రయోజనం కలుగుతుంది
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్, బొంరాస్పేట
గత మేలో తొలి విడత పనులు మొదలయ్యాయి. ఇప్పటికే చెరువులు, కుంటల బలోపేతానికి శ్రీకారం చుట్టాం. ఈనెల 15 నాటికి 20 శాతం పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పనులు పూర్తయిన చోట జెండావిష్కరణ చేపడతాం. ఈ పథకంతో అన్నదాతలకు ప్రయోజనం కలుగుతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి.
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నీటి వనరుల బలోపేతానికి కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. జలాన్ని వృద్ధి చేసి సాగు, తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చేయాలన్న సంకల్పంతో దేశ వ్యాప్తంగా అమృత్ సరోవర్ పథకాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా నీటి వనరులను ఎంపిక చేసి వాటి బాగుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 15 వరకు వాటిల్లో పూడికి తీసి, పనులు పూర్తయిన చోట జాతీయ జెండాను ఆవిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా జిల్లాల్లో పనులు సాగుతున్నాయి.
గ్రామాలు, పట్టణాల్లో కొన్నేళ్లుగా చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నాయి. కొన్ని చోట్ల శికం భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. వీటి పరిరక్షణకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, చర్యలు తీసుకుంటున్నా ఫలితం శూన్యమే. కుంటలు, చెరువుల కబ్జాలతో నీటి నిల్వకు విస్తీర్ణం తగ్గడంతో వీటి ప్రభావం భూగర్భ జలాలపై పడుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు, భూగర్భ జలాల వృద్ధికి అమృత్ సరోవర్ పథకాన్ని కేంద్రం చేపట్టింది. చెరువుల్లో పూడిక తీయడంతో పాటు వాటిని అభివృద్ధి చేసి, వెదురు, టేకు మొక్కలు నాటాల్సి ఉంటుంది.
జిల్లాల్లో ఇలా..
*సంగారెడ్డి జిల్లాలో 101 నీటి వనరులను ఎంపిక చేశారు. తొలి విడతలో 75 చోట్ల పనులు పూర్తి చేయాలని లక్ష్యం విధించారు. అందులో 20 శాతం చొప్పున ఆగస్టు 15 వరకు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయగా ఆ దిశగా పనులు సాగుతున్నాయి. 21 వనరుల్లో పూడికతీత పనులు పూర్తి చేశారు. వాటిలో కల్హేర్లో మూడు, అందోల్, గుమ్మడిదల, నాగల్గిద్ద, నారాయణఖేడ్లలో రెండు చొప్పున ఎనిమిది, హత్నూర, సిర్గాపూర్, న్యాల్కల్, పటాన్చెరు, సంగారెడ్డి, రాయికోడ్, వట్పల్లి, కంగ్టి, మొగుడంపల్లి, కొండాపూర్లో ఒకటి చొప్పున నీటి వనరుల్లో ఆయా పనులు పూర్తయ్యాయి.
* వికారాబాద్ జిల్లాలో 75 నీటి వనరులను ఎంపిక చేసింది. రూ.7.50 కోట్లు ఖర్చు చేయటానికి అంచనాలు రూపొందించి పనులు చేపట్టారు. ముందుగా నీటి నిల్వకు అవకాశాలున్న ప్రాంతాల్లోని 52 చెరువుల్లో ఉపాధి కూలీలతో పనులు చేపట్టారు. వీటిలో 20 ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయి.
పనుల తీరు..
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పూడికతీత కార్యక్రమాన్ని నాలుగు విడతలుగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ‘మిషన్ అమృత సరోవర్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉపాధి హామీ పథకం నిధులను వెచ్చిస్తోంది. ఇందులో కూలీలకు ఒక్కో చెరువుకు 300 నుంచి 500 వరకు పని దినాలు కల్పించేలా లక్ష్యంగా నిర్దేశించారు. ఎంపిక చేసిన వనరుల్లో పూడికతీత, కట్టను బలోపేతం, ముళ్ల పొదలు తొలగించడం వంటి పనులు చేపడతారు.
- శ్రీనివాస్రావు, డీఆర్డీవో, సంగారెడ్డి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడులకు నిర్వహణ నిధులు
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించి రెండో విడత నిధులు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత 50శాతం నిధులు గత ఏడాది జులైలో ప్రభుత్వం విడుదల చేసింది. -
కొత్త రేషన్కార్డులకు.. కోడ్ అడ్డంకి
[ 28-03-2024]
ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొందరికే ఇవి ఉండగా, చాలా మందికి లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కేవలం పథకాలే కాకుండా వైద్య సేవలు పొందే అవకాశం లేక ఆర్థికభారం పడుతోంది. -
సర్పంచి నుంచి.. ఎంపీ అభ్యర్థిగా..
[ 28-03-2024]
సేవా కార్యక్రమాల నిర్వహణతో రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న ఆయనను ఎంపీ టికెట్ వరించింది. ఏకంగా జాతీయ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కలిగింది. కాంగ్రెస్లో చేరిన కొద్దిరోజులకే ఎంపీ టికెట్ పొందడం గమనార్హం. -
గడువు ముంగిట పనుల హడావుడి
[ 28-03-2024]
పల్లెల్లో మట్టి దారులను సీసీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేస్తోంది. ఇందుకోసం గత నెల తొలి వారంలో ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెలాఖరుకు గడువు విధించారు. -
కార్మికులకు గుర్తింపు.. పథకాలతో ప్రయోజనాలు
[ 28-03-2024]
కార్మికులకు తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి జారీ చేసే గుర్తింపు కార్డులు చాలా ముఖ్యం. దీంతో సంఘంలో గుర్తింపు పాటు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. -
విద్యార్థులకు ప్రేరణ
[ 28-03-2024]
ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లోని సృజనను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రేరణ పేరుతో వారికి ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
ఈత కొలను తెరవరా?
[ 28-03-2024]
సిద్దిపేటలోని ఈత కొలను నిర్వహణ కొరవడుతోంది. నిత్యం కొనసాగించాల్సిన ఈ కొలను.. వేసవి ఆరంభమైన ఇంకా తెరవడం లేదు. ఆరేళ్ల కిందట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ రూ.5 కోట్ల వరకు ప్రభుత్వ నిధులు వెచ్చించి అందుబాటులోకి తెచ్చారు. -
అరచేతిలో లక్షల పుస్తకాలు
[ 28-03-2024]
ఉద్యోగ ప్రకటనలు వెలువడటంతో నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు. గ్రంథాలయాలు, కోచింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉద్యోగ సాధనే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. -
స్పందించండి.. సంధించండి
[ 28-03-2024]
ప్రజలు రాకపోకలు సాగించేటపుడు దారిలో అనేక సంఘటనలు చూస్తుంటారు. కొన్ని హృదయవిదారకంగా, ఎలాగైనా సాయం చేయాలనిపించేలా.. ఇంకొన్ని అన్యాయంగా, అక్రమంగా.. అగుపిస్తాయి. బిజీ జీవితమైనా ఉత్తమ పౌరులుగా స్పందించాలనిపిస్తుంది. -
మహిళాభ్యున్నతికి సహకారం
[ 28-03-2024]
సహకార బ్యాంకులు మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైౖతులకు రుణాలు ఇవ్వడం..వసూలు చేయడానికి ఇవి గతంలో పరిమితమయ్యేవి. ఇప్పుడు మహిళలు అర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడంలోనూ ముందుంటున్నాయి. -
దాత ఔదార్యం.. భక్తులకు సౌకర్యం
[ 28-03-2024]
వారి కులదైవమంటే ఆ దంపతులకు చాలా నమ్మకం. సొంత ఖర్చుతో దైవానికి ఆలయం నిర్మించారు. సరైన దారి లేక దర్శనానికి ఇబ్బంది పడుతున్న విషయం గమనించి తాజాగా వంతెన నిర్మిస్తున్నారు. -
ఆస్తి కోసం చిన్నమ్మనే కడతేర్చాడు
[ 28-03-2024]
ఈనెల 21న టేక్మాల్ మండలం తంపులూరులో హత్యకు గురైన మహిళను ఆమెకు వరుసకు కొడుకయ్యే వ్యక్తే చంపినట్లు పోలీసులు గుర్తించారు. టేక్మాల్లో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి బుధవారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. -
నిండు మనసుతో ఆశీర్వదించండి
[ 28-03-2024]
ఈ ప్రాంత ప్రజాసమస్యలపై లోతైన అవగాహన ఉందని, ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించాలని మెదక్ పార్లమెంట్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోరారు. సిద్దిపేటలో పార్టీ శ్రేణుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. -
మాజీ కలెక్టర్కు వేల కోట్లు ఎక్కడివి?
[ 28-03-2024]
భారాస మెదక్ లోక్సభ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు.డిమాండ్ చేశారు. -
భారాస విజయం తథ్యం: కొత్త ప్రభాకర్రెడ్డి
[ 28-03-2024]
మెదక్ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించటం తథ్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్లో మాట్లాడుతూ.. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్