కబ్జాలవుతున్నా కదలికేది?
ఏళ్ల పాటు ఉద్యోగం చేసి వచ్చిన వేతనంలో పైసాపైసా కూడబెట్టుకున్నారు. హైదరాబాద్కు శివారులో స్థలాలు కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్లయ్యాయి. పట్టా భూములంటూ గతంలో అధికారులూ అనుమతులిచ్చారు. ఆ తర్వాత ఇదంతా ప్రభుత్వ భూమి అంటూ చెప్పేయడంతో కొనుగోలు చేసిన వారంతా తీవ్ర షాక్కు గురయ్యారు
పట్టించుకోని అధికారులు
అమీన్పూర్ మండలం ఐలాపూర్లో తీరిది..
ఈనాడు, సంగారెడ్డి
విద్యుత్తు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ విక్రయించిన స్థలాల్లో పనులు
ఏళ్ల పాటు ఉద్యోగం చేసి వచ్చిన వేతనంలో పైసాపైసా కూడబెట్టుకున్నారు. హైదరాబాద్కు శివారులో స్థలాలు కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్లయ్యాయి. పట్టా భూములంటూ గతంలో అధికారులూ అనుమతులిచ్చారు. ఆ తర్వాత ఇదంతా ప్రభుత్వ భూమి అంటూ చెప్పేయడంతో కొనుగోలు చేసిన వారంతా తీవ్ర షాక్కు గురయ్యారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇంతలోనే కొందరు యథేచ్ఛగా కబ్జాలకు దిగారు. ఏం చేయాలో పాలుపోక రెవెన్యూ అధికారుల దృష్టికి బాధితులు విషయాన్ని తీసుకెళ్లారు. అయినా ప్రయోజనం దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు దశాబ్దాల క్రితం లేఔట్..
విద్యుత్తు ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీ 1982లో ఏర్పడింది. అమీన్పూర్ మండలం ఐలాపూర్లోని రెండు సర్వే సంఖ్యల్లో కలిపి 131 ఎకరాల విస్తీర్ణంలో లేఔట్ను అభివృద్ధి చేశారు. 725 కుటుంబాలకు చెందిన ఉద్యోగులు ఇక్కడ స్థలాలు కొనుగోలు చేశారు. భవిష్యత్తులో ధరలు పెరిగితే ఆమేరకు ప్రయోజనం దక్కుతుందని భావించారు. ఉద్యోగ విరమణ తర్వాత అక్కడే ఇళ్లు కట్టుకోవాలని కలలు కన్నారు. వీరు రిజిస్ట్రేషన్ చేసుకొని కొన్నవి పట్టా భూములు కావని, అవన్నీ ప్రభుత్వ భూములేనంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణ కొనసాగుతోంది. తుది తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని వారు భావిస్తున్న తరుణంలో కొందరు ఈ స్థలాలను కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాళ్లు, మట్టి పోసి...
‘ఈ భూమి ప్రభుత్వానిదంటూ అధికారులు చెబుతున్నారు. కొందరు కబ్జాలకు దిగుతుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని..’ విద్యుత్తు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీకి చెందిన సభ్యుడు బుచ్చిబాబు అధికారులను ప్రశ్నిస్తున్నారు. పట్టపగలే కొందరు ట్రాక్టర్లలో రాళ్లు, మట్టి తెచ్చి చదును చేస్తున్నారని, తాము గతంలో పాతిన హద్దురాళ్లనూ తొలగిస్తున్నారని.. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని మిగతా సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం..
- విజయ్, తహసీల్దారు, అమీన్పూర్
విద్యుత్తు ఉద్యోగుల సహకార హౌజింగ్ సొసైటీ కోసం అభివృద్ధి చేసిన లేఅవుట్ స్థలం ప్రభుత్వ భూమి అంటూ న్యాయస్థానంలో కేసు వేశాం. ప్రస్తుతం విచారణ దశలో ఉంది. తుదితీర్పు వచ్చేవరకు యథాతథస్థితి కొనసాగించాలని గతంలో న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇందులో కొంత మేర ఆక్రమణలు జరుగుతున్నాయి. అది మా దృష్టికీ వచ్చింది. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్నంతా నివేదికల రూపంలో ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం. తుదితీర్పు వచ్చిన తర్వాత ఆ మేరకు చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు