గృహప్రవేశాలకు వేళాయె..!
పేదల సొంతింటి కల నేరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈమేరకు జిల్లాలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తోంది. ప్రస్తుతం పలుచోట్ల నిర్మాణాలు పూర్తి కాగా.. అర్హులకు కేటాయించడానికి యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాకు
న్యూస్టుడే, మెదక్
పిల్లికొట్టాల్లో రెండు పడక గదుల ఇళ్లు
పేదల సొంతింటి కల నేరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈమేరకు జిల్లాలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తోంది. ప్రస్తుతం పలుచోట్ల నిర్మాణాలు పూర్తి కాగా.. అర్హులకు కేటాయించడానికి యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాకు 4,965 ఇళ్లను కేటాయించారు. ఇందులో 3,644 గృహనిర్మాణాలు మొదలు కాగా, ఇప్పటి వరకు 2,344 పూర్తయ్యాయి. మరో 1,300 వివిధ దశల్లో ఉన్నాయి. ఇందుకుగాను రూ.155.35 కోట్లు వెచ్చించారు. చాలా చోట్ల నిర్మాణాలు పూర్తయినా వాటి మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో పలుచోట్ల కిటికీలు, తలుపులు దెబ్బతింటున్నాయి. ఈ మేరకు జిల్లాలో ఇళ్ల పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న చోట కనసీ సౌకర్యాలు సమకూర్చి గృహప్రవేశాలు నిర్వహించాలని అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే అంశంపై గతనెలలో మంత్రి హరీశ్రావు అధికారులతో సమీక్షించారు. ఆయా చోట్ల మౌలిక వసతుల కల్పనకు రూ.6 కోట్ల వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
జిల్లా కేంద్రంలో 300...
మెదక్లోని పిల్లికొట్టాల్ వద్ద 900 పైగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిలో సుమారు 500 ఇళ్లు పూర్తయ్యాయి. అక్కడ సదుపాయాలు కల్పించి.. పంపిణీ చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్ఢి. మంత్రికి విజ్ఞప్తి చేశారు. 250 ఇళ్లకు సంబంధించి ఈనెల 11న ప్రవేశాలు నిర్వహించాలని నిర్ణయించినా పలు కారణాలతో వాయిదా పడింది. రెండు పడక గదుల ఇళ్ల కోసం 2,600 దరఖాస్తులు రాగా.. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి 2,000 మందిని అర్హులుగా తేల్చారు. ప్రస్తుతానికి 300 పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పనులను పంచాయతీరాజ్ శాఖ అధికారులు ధ్వంసమైన కిటికీల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయిస్తున్నారు. విద్యుత్తు కోసం స్తంభాలు, నియంత్రికలను బిగించారు. ప్రతి ఇంటికి నల్లా నీళ్లు సరఫరాయ్యేలా సింథటిక్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఈ పనులకు రూ.2.80 కోట్లు కేటాయించారు. మంత్రి ఆదేశాల మేరకు వసతులు కల్పించనున్నట్లు డీఈఈ పాండురంగాచారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం