మహాత్ముడి స్ఫూర్తి..ఆదర్శ దీప్తి!
పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. ఇది మహాత్ముడి మాట. నిజమే అవి అభివృద్ధి చెందితే దేశం స్వయంసమృద్ధి సాధించినట్లే. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ, మహాత్ముడిని స్ఫూర్తిగా సమష్టిగా అడుగేసి అభివృద్ధి
పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. ఇది మహాత్ముడి మాట. నిజమే అవి అభివృద్ధి చెందితే దేశం స్వయంసమృద్ధి సాధించినట్లే. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ, మహాత్ముడిని స్ఫూర్తిగా సమష్టిగా అడుగేసి అభివృద్ధి దిశగా సాగుతున్నాయి. అక్షరాస్యత, పరిశుభ్రత, మద్య నిషేధం.. ఇలా పలు అంశాల్లో మేటిగా నిలిచాయి. 75 ఏళ్ల స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ఆయా పల్లెలను మిగతావి ఆదర్శంగా తీసుకొని ఆ బాటలో పయనించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాలపై ‘ఈనాడు’ స్ఫూర్తిదాయక కథనం.
ఆడపిల్లకు.. ఊరంతా అండ
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం హరిదాస్పూర్ ఆడపిల్లలకు అండగా నిలుస్తోంది. ఇక్కడ అమ్మాయి పుడితే పండగ చేస్తారు. పంచాయతీ ఆధ్వర్యంలో అమ్మాయి పేరిట సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి తొలి నాలుగు ప్రీమియాలు చెల్లించేందుకు రూ.1000 అందిస్తున్నారు. ఆడపిల్లంటే భారం కాదని.. పురుషులతో సమానమేననే భావనను పెంచేందుకు 2020 జనవరి 1న దీనికి శ్రీకారం చుట్టారు. 12 ఏళ్లున్న ఆడపిల్లలందరి పేరిట ఖాతాలు తీయించారు. ఇప్పటివరకు 80 మందికి పైగా లబ్ధిపొందారు. ఈ స్ఫూర్తిని మిగతా పల్లెలూ అందిపుచ్చుకుంటున్నాయి.
స్వచ్ఛతలో భేష్..
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం పలు అంశాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. పల్లెప్రగతి స్ఫూర్తిని అందిపుచ్చుకుంది. 2020 ఏడాది చివరి నుంచి ప్రణాళికతో ముందడుగు వేశారు. 490 ఇళ్లుండగా.. నిత్యం ఆరు ట్రైసైకిళ్ల ద్వారా చెత్త సేకరిస్తున్నారు. సేంద్రియ ఎరువు తయారీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎరువు విక్రయం ద్వారా పంచాయతీకి రూ.86 వేల వరకు ఆదాయం వచ్చింది. ఊరంతా వినిపించేలా అక్కడక్కడ మైక్సెట్లు, సీసీ కెమెరాలు అమర్చారు. చెత్త బయటపడేస్తే నిఘా కళ్లకు దొరికిపోతారు. జరిమానా తప్పదు. ఇప్పటి వరకు ఎవరూ అలా చెత్త బయట పడేయలేదు. యువ సర్పంచి మల్లారెడ్డి చొరవతో గ్రామస్థులు భాగస్వాములయ్యారు.
ప్రగతిపథం..
గ్రామస్థులంతా కలిసికట్టుగా అభివృద్ధికి బాటలు వేసుకున్నారు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్నగర్ గ్రాస్థులు. సర్పంచి దివ్య, పాలకవర్గ సభ్యులు.. స్థానికుల సహకారంతో రాళ్లురప్పలతో ఉన్న ఏనగుట్టను చదును చేసి రైతువేదిక, వేడుక మందిరం నిర్మాణంతో పాటు పంట ఉత్పత్తులు ఆరబెట్టేందుకు 4 ఎకరాలు కేటాయించారు. కొనుగోలు కేంద్రానికి ఎకరం స్థలాన్ని కేటాయించారు. సహకార సంఘానికి మరో ఎకరం అప్పగించారు. ఇలా అందరూ కలిసి పల్లెను అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. - న్యూస్టుడే, కౌడిపల్లి
మద్యాన్ని నిషేధించి..
మద్యాన్ని నిషేధించి పక్కాగా అమలుచేస్తున్నారు చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట గ్రామస్థులు. మద్యంతో ఎంతో మంది నష్టపోయారు. కుటుంబాల్లో నిత్యం గొడవలు జరిగాయి. విసిగి వేసారిపోయిన మహిళలు, యువకులతో కలిసి సమావేశమై మద్యం విక్రయం, తాగడం పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. మహిళా సంఘం నాయకురాలు శివమ్మ ఆధ్వర్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించేలా కట్టుదిట్టం చేశారు. ఇప్పటికీ పక్కాగా దీన్ని అమలు చేస్తూ ఆదర్శంగా నిలిచారు. - చిన్నశంకరంపేట
సమష్టితత్వానికి నిదర్శనం
సమష్టి కృషి.. పట్టుదల.. ఆచరణకు నిదర్శనం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామం. 280 కుటుంబాలు ఉండగా, 1300 మంది జీవిస్తున్నారు. అందరికీ వ్యవసాయమే జీవనాధారం. 2014 ఆగస్టులో మంత్రి హరీశ్రావు దత్తత తీసుకోగా.. ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. పరిసరాల శుభ్రత, ఇంకుడు గుంతల నిర్మాణం, శుద్ధినీరు, మొక్కల సంరక్షణ, పాఠశాల అభివృద్ధి, సామూహిక గొర్రెల షెడ్లు, పశువుల వసతిగృహం, కందకాల నిర్మాణం, పందిరి సాగు, పురాతన బోరుబావుల రీఛార్జి, గ్రామస్థులందరికీ ఒకే దఫాలో మోటారు డ్రైవింగ్ లైసెన్సులు ఇలా అన్ని కార్యక్రమాలను చేపట్టి ఆదర్శంగా నిలిచారు. - న్యూస్టుడే, సిద్దిపేట అర్బన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు