పాదం కలిపి నడిచారు.. స్వాతంత్య్ర స్ఫూర్తి రగిల్చారు!
అడుగడుగునా దేశభక్తి ఉప్పొంగింది. 750 మీటర్ల జాతీయ పతాకం... ఇరువైపులా విద్యార్థులు, యువత. బోనాలతో కదిలొచ్చిన మహిళలు.. పోతరాజుల విన్యాసాలు... చిందుకళాకారుల నృత్యాలు.. భిన్న కులాల వారు వృత్తి వేషధారణలతో హాజరు..
సంగారెడ్డి పట్టణంలో అట్టహాసంగా ఫ్రీడం ర్యాలీ
పాల్గొన్న మంత్రి హరీశ్రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు
ఈనాడు, సంగారెడ్డి
అడుగడుగునా దేశభక్తి ఉప్పొంగింది. 750 మీటర్ల జాతీయ పతాకం... ఇరువైపులా విద్యార్థులు, యువత. బోనాలతో కదిలొచ్చిన మహిళలు.. పోతరాజుల విన్యాసాలు... చిందుకళాకారుల నృత్యాలు.. భిన్న కులాల వారు వృత్తి వేషధారణలతో హాజరు.. ఎన్సీసీ క్యాడెట్ల కవాతులు.. సంగారెడ్డి ప్రధాన రహదారిపై ప్రతి ఒక్కరి చేతిలో జాతీయ జెండాలు... జైహింద్ నినాదాలు... ఒక్కమాటలో చెప్పాలంటే పండగలన్నీ ఒక్కసారే వచ్చినంత సంబరం. ఇదీ సంగారెడ్డి పట్టణంలో ఫ్రీడం ర్యాలీ నిర్వహణ సందర్భంగా కనిపించిన దృశ్యం. జిల్లా పాలనాధికారి శరత్ నేతృత్వంలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది. ఆర్థిక మంత్రి హరీశ్రావు, జడ్పీ అధ్యక్షుడు మంజుశ్రీ, ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీపాటిల్, డీసీఎంఎస్ ఛైర్మన్ మల్కాపురం శివకుమార్, సంగారెడ్డి పురపాలిక అధ్యక్షురాలు విజయలక్ష్మి, తెరాస జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్.. ఇలా అంతా కలిపి వేల మందితో ర్యాలీలో పాదం కలిపి నడిచారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న గడీల లింగమయ్యగౌడ్తో పాటు మరో మహిళకు సన్మానం చేసి గౌరవించారు. త్రివర్ణ బెలూన్లను, పావురాలను ఎగరేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో వజ్రోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని 75 అడుగుల ఎత్తైన జెండాను ఏర్పాటు చేశారు. మంత్రి హరీశ్రావు దీనిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అన్నమో రామచంద్రా అనే పరిస్థితి నుంచి 75 ఏళ్లలో ఇతర దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి దేశం ఎదిగిందని అన్నారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తిలో మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణలోని పల్లెలు గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి ప్రతీకలుగా మారాయన్నారు. సంసద్ ఆదర్శ్ యోజనలో అవార్డు పొందిన తొలి 20లో 19 మన రాష్ట్రానికి చెందిన పల్లెలు ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఆగస్టు 15న కొత్తగా 42వేల మందికి ఆసరా పథకంలో భాగంగా పింఛన్లు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. భారీస్థాయిలో ర్యాలీ నిర్వహించడం, దానిని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా పాలనాధికారి శరత్ను అభినందించారు. ఈపనిలో భాగస్వామ్యులయిన అదనపు పాలనాధికారులు రాజర్షిషా, వీరారెడ్డిలతో పాటు ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
జెండా వందనం చేస్తున్న మంత్రి హరీశ్రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి,
బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, క్రాంతికిరణ్, అధికారులు
ర్యాలీలో విద్యార్థిని ఉత్సాహం..
మహనీయుల వేషధారణలో చిన్నారులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.