కొత్తవి వస్తాయని.. పాతవి పారేసుకుంటారా!
‘రాజుల సొమ్ము రాళ్ల పాలు’ అనే నానుడికి హుస్నాబాద్ ఆసుపత్రిలోని పరికరాలు సరిపోలుతాయి. ఈ దవాఖానాను వైద్యవిధాన పరిషత్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందుకు అవసరమైన వైద్య సేవలకు కొత్తగా ఆధునిక పరికరాలు, యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఆసుపత్రి పాత భవనం బయట పడవేసిన పరికరాలు, యంత్రాలు
న్యూస్టుడే, హుస్నాబాద్: ‘రాజుల సొమ్ము రాళ్ల పాలు’ అనే నానుడికి హుస్నాబాద్ ఆసుపత్రిలోని పరికరాలు సరిపోలుతాయి. ఈ దవాఖానాను వైద్యవిధాన పరిషత్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందుకు అవసరమైన వైద్య సేవలకు కొత్తగా ఆధునిక పరికరాలు, యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పాతవి కొద్దిపాటి మరమ్మతులు చేసి పునర్వినియోగంలోకి తేకుండా మూలన పడేస్తున్నారు. మట్టిలో, వర్షంలో పరికరాలు, సామగ్రి ఉండటంతో తుప్పు పడుతున్నాయి. తర్వాత దశలో దేనికి పనికిరాకుండా వ్యర్థాల్లోకి చేరే అవకాశముంది. హుస్నాబాద్లోని 30 పడకల ప్రాథమికోన్నత శ్రేణి ఆరోగ్య కేంద్రానికి చెందిన లక్షలాది రూపాయల విలువ చేసే వైద్య పరికరాలు, మంచాలను బయట పడేశారు. ఇందులో కొన్ని అసలు ఉపయోగించనివీ ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించడానికి పదేళ్ల క్రితం ఈ ఆసుపత్రికి లక్షలాది రూపాయలు వెచ్చించి పరికరాలను ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిని వినియోగించకుండానే వృథాగా పడేసి పనికి రాకుండా చేస్తుండటం గమనార్హం.
తుప్పు పడుతున్న మంచాలు
మూలకు ఇంక్యుబేటర్..
కొన్ని పరికరాలను కనీసం ఉపయోగంలోకి తెచ్చే ప్రయత్నాలు జరగటం లేదు. అవకాశాలు ఉన్నా అందుకు అనుగుణంగా సిబ్బంది లేరు. దీంతో వాటిని మూలన పడేశారు. ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్లోకి మారిన తర్వాత మంత్రి హరీశ్రావు, శాసనసభ్యుడు సతీశ్కుమార్ ఎప్పటికప్పుడు సంబంధిత నిర్మాణ పనులపై సమీక్ష చేస్తున్నారు. దాదాపు 35 ఏళ్ల క్రితం నిర్మించిన 30 పడకల ఆసుపత్రి పాత భవనాన్ని ఆధునీకరిస్తున్నారు. మరమ్మతులు చేయాల్సిన వైద్య పరికరాలను పాత భవనంలో ఆరుబయట వేశారు. ఇందులో నవజాత శిశువులకు ఉపయోగించే ఇంక్యూబేటర్, శస్త్ర చికిత్స విభాగంలో వినియోగించే వివిధ రకాల సామగ్రి ఉన్నాయి. 20 మంచాలు బయట పడవేశారు. గతంలో ఎక్స్రే ప్లాంటునూ మూలన పడేశారు. ఎంతో ఖర్చు చేసి ప్రజలకు ఉపయోగపడటానికి తెచ్చిన వైద్య పరికరాలను ఇలా వృథా అయ్యేలా పారేయడంతో స్థానికులు విస్తుబోతున్నారు. సొంతంగా ఇళ్లల్లో సామగ్రిని ఇలాగే పడేసుకుంటారా.. ప్రజాధనమంటే చులకనా.. అని ప్రశ్నిస్తున్నారు. వీటిని రోగులకు ఉపయోగపడే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆసుపత్రి పనితీరుపై తరచూ పర్యవేక్షణ జరపాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాలతో నాంది
[ 18-04-2024]
జిల్లా స్థాయిలో లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టరేట్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి -
పడిలేచిన కెరటం.. అర్పిత
[ 18-04-2024]
అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది -
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
[ 18-04-2024]
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు అవకాశాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: ‘ఉత్తమ విలన్’పై లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ