logo

యాప్‌లో పాఠం.. నైపుణ్య పాటవం

యువతకు ఏదైనా ఓ రంగంలో నైపుణ్యం ఉంటేనే భవితకు బాటలు వేసుకోవచ్చు. దీనిని గుర్తించి ప్రభుత్వం స్వయం ఉపాధి నైపుణ్యాభివృద్ది కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది.

Published : 02 Oct 2022 01:26 IST

భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు మంచి అవకాశం


ధ్రువపత్రాలతో విద్యార్థులు

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ: యువతకు ఏదైనా ఓ రంగంలో నైపుణ్యం ఉంటేనే భవితకు బాటలు వేసుకోవచ్చు. దీనిని గుర్తించి ప్రభుత్వం స్వయం ఉపాధి నైపుణ్యాభివృద్ది కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. భవన కార్మికుల పిల్లలకు వివిధ వృత్తి కోర్సుల్లో ఉచితంగా తర్ఫీదు ఇచ్చేందుకు సెట్విన్‌, తెలంగాణ భవన నిర్మాణ కార్మిక శాఖ సంయుక్తంగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది. ఎంపిక చేసిన అభ్యర్థులకు చరవాణి ద్వారా శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో భవన నిర్మాణ రంగంలో పని చేసే వారు సుమారుగా 46 వేల మంది. వీరిపై ఆధారపడి జీవించే కుటుంబ సభ్యులు సంఖ్య మూడింతలు ఉంటుంది. వీరిలో అర్హత ఉన్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

ధ్రువపత్రాల పంపిణీ: మొదటి విడతగా ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాలో 1,250 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వీరిలో వివిధ రకాల కోర్సులు నేర్చుకున్నవారికి పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన 200 మందికి ధ్రువపత్రాలను ఇటీవల పంపిణీ చేశారు.

కోర్సులు ఇలా..
మూడు నెలలవి: డీటీపీ, ఎంఎస్‌ ఆఫీస్‌, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, హౌజ్‌ వైరింగ్‌, సీ సీ++, ట్యాలీ, ఫైతాన్‌, మెకానికల్‌ ఆటో, పీసీబీ డిజైన్‌, ఎంబ్రాయిడరీ, మెట్‌ల్యాబ్‌, ఐఓటీ, రోబోటిక్స్‌, త్రీ డీ ప్రింటింగ్‌.
ఆరు నెలలు: డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, జావా, ఇంటర్‌నెట్‌, ఎఐ అండ్‌ ఎంఎల్‌.
12 నెలలు: గేట్‌, జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్‌, బీఎస్‌ఆర్‌బీ వీటిల్లో తర్ఫీదు పొందేందుకు 21ఏళ్లు ఉండాలని అధికారులు తెలిపారు.


అక్టోబరులో రెండో బ్యాచ్‌

సాద్విక్‌, ప్రాజెక్టు మేనేజర్‌, ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాలు

ఆక్టోబరులో రెండో బ్యాచ్‌ను ప్రారంభిస్తాం. కోర్సులకు సంబంధించిన ఆన్‌లైన్‌ తరగతులను అనుభవజ్ఞులైన ఐటీ నిపుణులతో రూపొందించారు. త్రీడీ విధానంలో వీటిని తయారు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్‌ ఆధ్వర్యంలో ఈ యాప్‌ రూపుదిద్దుకుంది. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఐడీ పాస్‌వర్డ్‌ ఇస్తాం. దీని ద్వారా పాఠాన్ని వీక్షించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని