యాప్లో పాఠం.. నైపుణ్య పాటవం
యువతకు ఏదైనా ఓ రంగంలో నైపుణ్యం ఉంటేనే భవితకు బాటలు వేసుకోవచ్చు. దీనిని గుర్తించి ప్రభుత్వం స్వయం ఉపాధి నైపుణ్యాభివృద్ది కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది.
భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు మంచి అవకాశం
ధ్రువపత్రాలతో విద్యార్థులు
న్యూస్టుడే, వికారాబాద్ మున్సిపాలిటీ: యువతకు ఏదైనా ఓ రంగంలో నైపుణ్యం ఉంటేనే భవితకు బాటలు వేసుకోవచ్చు. దీనిని గుర్తించి ప్రభుత్వం స్వయం ఉపాధి నైపుణ్యాభివృద్ది కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. భవన కార్మికుల పిల్లలకు వివిధ వృత్తి కోర్సుల్లో ఉచితంగా తర్ఫీదు ఇచ్చేందుకు సెట్విన్, తెలంగాణ భవన నిర్మాణ కార్మిక శాఖ సంయుక్తంగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది. ఎంపిక చేసిన అభ్యర్థులకు చరవాణి ద్వారా శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో భవన నిర్మాణ రంగంలో పని చేసే వారు సుమారుగా 46 వేల మంది. వీరిపై ఆధారపడి జీవించే కుటుంబ సభ్యులు సంఖ్య మూడింతలు ఉంటుంది. వీరిలో అర్హత ఉన్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ధ్రువపత్రాల పంపిణీ: మొదటి విడతగా ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాలో 1,250 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వీరిలో వివిధ రకాల కోర్సులు నేర్చుకున్నవారికి పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన 200 మందికి ధ్రువపత్రాలను ఇటీవల పంపిణీ చేశారు.
కోర్సులు ఇలా..
మూడు నెలలవి: డీటీపీ, ఎంఎస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లీష్, హౌజ్ వైరింగ్, సీ సీ++, ట్యాలీ, ఫైతాన్, మెకానికల్ ఆటో, పీసీబీ డిజైన్, ఎంబ్రాయిడరీ, మెట్ల్యాబ్, ఐఓటీ, రోబోటిక్స్, త్రీ డీ ప్రింటింగ్.
ఆరు నెలలు: డిప్లొమా ఇన్ కంప్యూటర్ హార్డ్వేర్, జావా, ఇంటర్నెట్, ఎఐ అండ్ ఎంఎల్.
12 నెలలు: గేట్, జీఆర్ఈ, ఐఈఎల్టీఎస్, బీఎస్ఆర్బీ వీటిల్లో తర్ఫీదు పొందేందుకు 21ఏళ్లు ఉండాలని అధికారులు తెలిపారు.
అక్టోబరులో రెండో బ్యాచ్
సాద్విక్, ప్రాజెక్టు మేనేజర్, ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాలు
ఆక్టోబరులో రెండో బ్యాచ్ను ప్రారంభిస్తాం. కోర్సులకు సంబంధించిన ఆన్లైన్ తరగతులను అనుభవజ్ఞులైన ఐటీ నిపుణులతో రూపొందించారు. త్రీడీ విధానంలో వీటిని తయారు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ ఆధ్వర్యంలో ఈ యాప్ రూపుదిద్దుకుంది. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఐడీ పాస్వర్డ్ ఇస్తాం. దీని ద్వారా పాఠాన్ని వీక్షించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ