గొల్లభామ మెరిసింది.. మగ్గం మురిసింది!
ఈ ప్రాంత కళాత్మక వైభవాన్ని చాటే గొల్లభామ చీర.. మరోసారి మెరిసింది. నేతన్న నైపుణ్య సృష్టికి తార్కాణంగా.. యునెస్కో విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది. ‘21 శతాబ్దం కోసం తయారీ చేసిన చేనేత వస్త్రాలు - సంప్రదాయ భారతీయ వస్త్రాల సంరక్షణ’..
న్యూస్టుడే, సిద్దిపేట
చీర నేత పనిలో కార్మికుడు
ఈ ప్రాంత కళాత్మక వైభవాన్ని చాటే గొల్లభామ చీర.. మరోసారి మెరిసింది. నేతన్న నైపుణ్య సృష్టికి తార్కాణంగా.. యునెస్కో విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది. ‘21 శతాబ్దం కోసం తయారీ చేసిన చేనేత వస్త్రాలు - సంప్రదాయ భారతీయ వస్త్రాల సంరక్షణ’ పేరిట విడుదల చేసిన నివేదికలో తెలుగు రాష్ట్రాల్లో మూడింటికి చోటు దక్కింది. పల్లె సిగలో నడయాడే మగువ (గొల్ల వనిత) తలమీద చల్లకుండ.. కుడిచేతిలో గురిగి.. కాళ్లకు గజ్జెలు, కొప్పులో పూలు ధరించి.. సంచరించే గొల్లభామ నేతన్న చీరల్లో దశాబ్దాల కిందటే ఇమిడిపోయింది. చూపరులను మంత్ర ముగ్ధులను చేసే ఈ ప్రత్యేకమైన చీర.. చేనేతల కళా నైపుణ్యానికి మచ్చుతునకలా నిలుస్తోంది. సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో 1960లోనే గొల్లభామ చీరలు నేసేవారు. వేలాదిగా కార్మికులు ఉపాధి పొందేవారు. కాలక్రమంలో మార్పు వచ్చింది. ఆరేళ్ల కిందట జాకార్డు మగ్గాలు అందుబాటులోకి రావడంతో నాటి వైభవాన్ని క్రమంగా సంతరించుకుంటోంది. గతంలో ఫ్రేమ్ (గుంత) మగ్గాలను వినియోగించారు. చీర తయారీ కావాలంటే వారం నుంచి పది రోజుల సమయం పట్టేది. జాకార్డ్ మగ్గంపై మూడు నుంచి నాలుగు రోజుల్లో నేస్తున్నారు. ఒకటి రూ.2500 నుంచి రూ.4 వేల వరకు పలుకుతోంది. టెస్కో కొనుగోలు చేసి విపణిలోకి తెస్తోంది. బహిరంగ విపణితోపాటు ఆన్లైన్లో విక్రయాలు సాగుతున్నాయి. ఒక చీరపై 10 నుంచి 15 వరకు గొల్లభామ బొమ్మలు తీర్చిదిద్దుతారు. జిల్లాలో 45 వరకు జాకార్డ్ మగ్గాలు అందుబాటులో ఉన్నాయి. కొందరు ఇప్పటికీ పాతవిధానంలోనే తయారీ చేస్తున్నారు.
నెలలో 300కి పైగా..
జిల్లాలో 18 చేనేత సహకార సంఘాలు ఉండగా 500 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వారిలో 40 మంది కార్మికులు గొల్లభామ చీరలు, దుప్పట్టాలు నేస్తున్నారు. చీరకు 2012లో విశిష్ట భౌగోళిక గుర్తింపు లభించింది. పేటెంటు హక్కులను సిద్దిపేట పొందడం మరో విశేషం. ప్రస్తుతం నెలకు 300కిపైగా ఉత్పత్తి చేస్తున్నారు. పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారిణులు, ఎన్నారైలు, సినీతారలు ఆసక్తి కనబర్చుతుంటారు. గొల్లభామ పట్టు చీరలు సైతం తయారీ చేస్తున్నారు. దీని ధర రూ.10 వేలకు పైగా పలుకుతోంది. మరిన్ని మార్పులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కార్మికులు శ్రమిస్తున్నట్లు ఆదర్శ చేనేత సహకార సంఘం మేనేజర్ హన్మంతు చెబుతున్నారు.
ఆరేళ్లుగా తయారీ..
గొల్లభామ చీరలు, దుప్పట్టాలను ఆరేళ్లుగా నేస్తున్నా. గొల్లభామ చీర తయారీకి మూడు రోజుల సమయం పడుతోంది. ఒక రోజులో దుప్పట్టా (చున్నీ) తయారు చేయవచ్చు. నెలకు రూ.10వేల వరకు ఆదాయం సమకూరుతోంది. యునెస్కో చీరను గుర్తించడం ఆనందంగా ఉంది. కూలీ పెంచితే మా జీవితాలు మెరుగవుతాయి.
- సత్యం, చేనేత కార్మికుడు, సిద్దిపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM