‘జాతిని జాగృతం చేసిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్’
జాతిని జాగృత పరిచిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని ఎమ్మెల్సీ, జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా బల్కంచెల్క తండాలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
బతుకమ్మను తీసుకెళ్తున్న కవిత, మహిళలు
కల్హేర్, నిజాంపేట్: జాతిని జాగృత పరిచిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని ఎమ్మెల్సీ, జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా బల్కంచెల్క తండాలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటులో సేవాలాల్ మహారాజ్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ‘తీజ్’ను రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోరుతూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అంతకుముందు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ మంజుశ్రీ, చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్ చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, సర్పంచి లలిత, ఎస్పీ రమణకుమార్, డీఎస్పీ బాలజీ తదితరులు పాల్గొన్నారు.
కమిషనరేట్లో బతుకమ్మ సంబురాలు
కోలాటం ఆడుతున్న సీపీ శ్వేత, పాలనాధికారి సతీమణి జ్యోతి పాటిల్ తదితరులు
సిద్దిపేట, న్యూస్టుడే: బతుకమ్మ సంబురాలతో సిద్దిపేట పోలీసు కమిషనరేట్ ప్రాంగణం సందడిగా మారింది. సీపీ శ్వేత మొదలు వివిధ స్థాయిల్లోని మహిళా పోలీసులు, వారి కుటుంబీకులు ఆనందోత్సాహాల నడుమ వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం నిర్వహించిన సంబురానికి జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, జ్యోతి పాటిల్ దంపతులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పూలతో వివిధ రకాల బతుకమ్మలను పేర్చి ఒకచోటికి చేర్చి ఆడిపాడారు. కోలాటంతో సందడి చేశారు. ఆకట్టుకునేలా పేర్చిన బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేశారు. అదనపు డీసీపీ మహేందర్, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు దేవారెడ్డి, సతీశ్, రమేశ్, ఏవో యాదమ్మ, మహిళా ఠాణా సీఐ దుర్గ, వివిధ ఠాణాల ఇన్స్పెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.
చిన్నకోడూరు: ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, దీనికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై విధులు నిర్వర్తించాలని సీపీ శ్వేత సూచించారు. శనివారం చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు శివారులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన వారాంతపు పరేడ్ను ఆమె సందర్శించి పలు సూచనలు చేశారు.
పూల సంబురం.. పులకించె భక్తజనం
సంగారెడ్డి పురపాలక కార్యాలయంలో అధ్యక్షురాలు జయలక్ష్మి, తదితరులు
జహీరాబాద్ సాయిరామ్నగర్ కాలనీలో నిమజ్జనం చేస్తూ..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హస్త’గతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
దివ్యమైన ఓటుకు సాక్ష్యం
[ 20-04-2024]
సాక్ష్యం యాప్లో దివ్యాంగులకు అవసరమైన సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అది ఏ స్థాయిలో ఉందో ఆరా తీయవచ్చు. -
కలెక్టరేట్ కేంద్రంగా కీలక విభాగాలు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ అంటే సామాన్యమేమీ కాదు.. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.