ఎన్డీఎస్ఎల్కు పూర్వవైభవం తీసుకొస్తాం
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నిజాం దక్కన్ చక్కెర కర్మాగారాన్ని (ఎన్డీఎస్ఎల్) తెరిపిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి విస్మరించారని వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఆదివారం ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర మెదక్కు చేరుకుంది.
వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల
షర్మిలకు నాగలిని బహూకరిస్తున్న వనపర్తి వెంకటేశం, తదితరులు
మెదక్, మెదక్ రూరల్, కొల్చారం: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నిజాం దక్కన్ చక్కెర కర్మాగారాన్ని (ఎన్డీఎస్ఎల్) తెరిపిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి విస్మరించారని వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఆదివారం ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర మెదక్కు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. గతంలో ఎన్డీఎస్ఎల్ రైతులకు ఎంతో ఉపయోగపడేదన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో తెరిపించేందుకు కమిటీ వేశారని, అందులో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సభ్యురాలిగా ఉన్నారని గుర్తు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కర్మాగారాన్ని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. అధికారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిది, పెత్తనం ఆమె భర్తదని, కమీషన్లు లేకుండా ఏపని ముందుకు సాగదని ఆరోపించారు. కోనాపూర్ సోసైటీలో డబ్బులను స్వాహా చేసినా, ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు తమ సమస్యలను ఆమెకు విన్నవించారు. అంతకు ముందు మండల పరిధి మంబోజిపల్లి నుంచి మెదక్ పట్టణం వరకు షర్మిల పాదయాత్ర నిర్వహించగా, కార్యకర్తలు జలపందిరి, పీర్లతో ఘనస్వాగతం పలికారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం షర్మిలకు నాగలిని బహూకరించారు. రాంరెడ్డి , నీలం రమేశ్, ఏపూరి సోమన్న, రాజగోపాల్, రోహిత్, సురేశ్ పాల్గొన్నారు. అంతకుముందు కొల్చారం మండలం పొతంశెట్టిపల్లి, కిష్టాపూర్, రాంపూర్, మెదక్ మండలం మాచవరం, మంబోజిపల్లిలో పాదయాత్ర కొనసాగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ