ఇంటింటికి చేరని మంజీరా!
మిషన్ భగీరథ.. ఇంటింటికి నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకం. నర్సాపూర్ పట్టణంలో దీని ద్వారా ప్రతి ఇంటికి మంజీరా నీరందించాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఏ వార్డులోనూ పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడంతో ప్రతి ఇంటికి పంపిణీ సాధ్యం కావడం లేదు.
4వ వార్డులో ఇలా..
న్యూస్టుడే, నర్సాపూర్: మిషన్ భగీరథ.. ఇంటింటికి నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకం. నర్సాపూర్ పట్టణంలో దీని ద్వారా ప్రతి ఇంటికి మంజీరా నీరందించాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఏ వార్డులోనూ పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడంతో ప్రతి ఇంటికి పంపిణీ సాధ్యం కావడం లేదు. పురపాలికలోని 15 వార్డుల్లో మంజీరా సరఫరా అస్తవ్యస్తంగా మారింది. గతేడాది వర్షాభావ పరిస్థితులతో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. చాలామంది ట్యాంకర్ల మీదే ఆధారపడ్డారు. మంజీరా నీటి సరఫరానూ ఏడాది పాటు నిలిపివేశారు. ఈ సారి సమృద్ధిగా వానలు కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో ఇక ఇబ్బందులు ఉండవని భావించినా ప్రణాళికాలోపంతో లక్ష్యం నెరవేరడం లేదు. 6 వేలకు పైగా నల్లాలు ఉండగా, 3,667 భగీరథ కనెక్షన్లు ఉన్నాయి. రోజూ 2,400 కిలోలీటర్ల నీటిని పంపింగ్ చేస్తున్నారు. 37 బోర్లు వినియోగంలో ఉండగా, 12 పెద్ద, 6 చిన్న ట్యాంకులు ఉన్నాయి.
అస్తవ్యస్త పనులు
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం చక్రియాల నుంచి హత్నూర మండలం బోర్పట్ల ఫిల్టర్బెడ్కు మంజీరా నీటి సరఫరా చేస్తారు. అక్కడ శుద్ధి చేశాక నర్సాపూర్కు తరలిస్తుంటారు. చక్రియాల ఇన్టేక్వెల్ నుంచి పంపిణీ బాగానే జరుగుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం జరగడం లేదు. పట్టణంలోని ఒకటి, రెండు వార్డులకు మినహా మిగతా అన్ని చోట్లకు సరిగా రావడం లేదు. ప్రధాన, అంతర్గత పైప్లైన్ల నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా సాగడంతో ఈ సమస్య తలెత్తుతోంది. చాలా చోట్ల అవసరాలకు అనుగుణంగా పైప్లైన్లు వేయలేదు. చిన్నగొట్టాలు బిగించడంతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇబ్బందులు పడుతూ..
పట్టణంలోని 1 నుంచి 8 వార్డులకు మంజీరా నీరే ఆధారం. భగీరథ పథకంలో ప్రతి ఇంటి వరకు పైపులు తీసుకొచ్చి వదిలేశారు. వాటికి నల్లాలు బిగించలేదు. పలు వార్డుల్లో స్వచ్ఛందంగా బిగించుకోవాలని వాటిని ప్రజలకే ఇచ్చేశారు. చాలాచోట్ల బిరడాలు ఏర్పాటుచేయకపోవడంతో నీరంతా వృథాగా పోతోంది. 5, 6, 4, 14, వార్డుల్లో సమస్య తీవ్రంగా ఉంది.
పరిష్కరిస్తాం..: చాముండేశ్వరి, కమిషనర్
కొన్ని వార్డుల్లో నీటి సరఫరాలో ఇబ్బందులున్న మాట వాస్తవమే. ఎప్పటికప్పుడు పథకం నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్తున్నాం. కొన్ని కాలనీలలో పూర్తి స్థాయిలో పైప్లైన్ల నిర్మాణం జరగలేదు. మరి కొన్ని చోట్ల కొత్తవి బిగించాల్సి ఉంది. సమస్యను పరిష్కరిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ