హక్కులపై ఆశలు..!
తరతరాలుగా సాగు చేస్తున్న భూమిపై హక్కుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పోడు వ్యవసాయాన్ని గుర్తించి సాగు చేస్తున్న వారికే దక్కాలని పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హక్కులు దక్కని పోడు రైతుల సమస్యకు పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి 11 నెలల కిందట శ్రీకారం చుట్టింది.
‘పోడు’ దరఖాస్తుల పరిశీలన పూర్తి
సర్వే ప్రక్రియ షురూ
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, కల్హేర్
క్రిష్ణాపూర్లో వివరాలు సేకరిస్తున్న అధికారులు
తరతరాలుగా సాగు చేస్తున్న భూమిపై హక్కుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పోడు వ్యవసాయాన్ని గుర్తించి సాగు చేస్తున్న వారికే దక్కాలని పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హక్కులు దక్కని పోడు రైతుల సమస్యకు పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి 11 నెలల కిందట శ్రీకారం చుట్టింది. దరఖాస్తులూ స్వీకరించింది. ఆ తరువాత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందకపోవడంతో ఎదురుచూపులే మిగిలాయి. ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణ ఫలించనుంది. ఎట్టకేలకు క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభమైంది.
అత్యధికంగా కల్హేర్లోనే..
గతేడాది నవంబరు 8-16వరకు దరఖాస్తులు స్వీకరించగా జిల్లా వ్యాప్తంగా 3,934 దరఖాస్తులు వచ్చాయి. 7,109 ఎకరాల భూమికి హక్కు పత్రాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తులు చేశారు. జిల్లాలో కల్హేర్, మొగుడంపల్లి, ఝరాసంగం, హత్నూర, నారాయణఖేడ్, చౌటకూరు, కోహీర్, సిర్గాపూర్, వట్పల్లి, జహీరాబాద్ మండలాల్లో ‘పోడు’ సమస్యలు ఉన్నాయి. అత్యధికంగా కల్హేర్ మండలం 1324 మంది 2,344 ఎకరాల్లో తమకు హక్కులు కల్పించాలంటూ దరఖాస్తు చేసుకున్నారు.
క్షేత్రస్థాయిలో జీపీఎస్ ఆధారితంగా..
పోడు దరఖాస్తులపై సమగ్ర వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. దీనిపై ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించింది. ప్రస్తుతం ఆయా శాఖల అధికారులు భూములపై జీపీఎస్ ఆధారిత సర్వే నిర్వహిస్తున్నారు. ఎంతమేర భూమిలో కబ్జా ఉన్నారన్న వివరాలను నమోదు చేస్తున్నారు. సర్వే ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. హక్కు పత్రాలు దక్కాలంటే 2005కు ముందు నుంచి అటవీ భూముల్లో సాగు చేస్తున్నట్లు ఆధారాలు ఉండటంతో పాటు అటవీశాఖ కేసులు ఉంటే దరఖాస్తుదారులు జత చేయాల్సి ఉంటుంది. గిరిజనేతరులైతే మూడు తరాలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలి. ప్రస్తుతం అందిన దరఖాస్తుల్లో ఇందుకు అనుగుణంగా ఉన్న వాటికే ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
నివేదిక రాగానే..: ఫిరంగి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి
పోడు భూముల సమస్య పరిష్కారంపై ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తున్నాం. హక్కు పత్రాల కోసం అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన ఇప్పటికే పూర్తి చేశాం. అర్హులుగా తేలిన వారికి మాత్రమే హక్కు పత్రాలు అందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పోడు భూముల సర్వే ప్రక్రియ కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాలతో నాంది
[ 18-04-2024]
జిల్లా స్థాయిలో లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టరేట్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి -
పడిలేచిన కెరటం.. అర్పిత
[ 18-04-2024]
అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది -
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
[ 18-04-2024]
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు అవకాశాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ