స్వచ్ఛస్ఫూర్తి.. వెలుగొందిన కీర్తి!
సిద్దిపేట బల్దియా స్వచ్ఛతలో ప్రత్యేకత చాటుతోంది. వివిధ అంశాల్లో మేటిగా నిలుస్తూ ఆదర్శ పథంలో పయనిస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్-2022 పోటీల్లో ఏడు అంశాల్లో తనదైన ముద్ర వేసింది. జిల్లా కేంద్రంలో చెత్త సేకరణకు దాదాపు 50 పారిశుద్ధ్య వాహనాల ద్వారా పాటలను వినిపిస్తూ ప్రజా చైతన్యం తెస్తున్నారు.
ఏడు అంశాల్లో విశిష్టత చాటిన సిద్దిపేట బల్దియా
న్యూస్టుడే, సిద్దిపేట
సిద్దిపేట బల్దియా స్వచ్ఛతలో ప్రత్యేకత చాటుతోంది. వివిధ అంశాల్లో మేటిగా నిలుస్తూ ఆదర్శ పథంలో పయనిస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్-2022 పోటీల్లో ఏడు అంశాల్లో తనదైన ముద్ర వేసింది. జిల్లా కేంద్రంలో చెత్త సేకరణకు దాదాపు 50 పారిశుద్ధ్య వాహనాల ద్వారా పాటలను వినిపిస్తూ ప్రజా చైతన్యం తెస్తున్నారు. తడి చెత్త- 26.8, పొడి... 16.5, నిర్మాణ వ్యర్థాలు- 1.7, పూడిక- 6.85, ఇతరత్రావి- 2.6 టన్నుల మేర వెలువడుతున్నాయి. తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారీ చేస్తుండగా, పొడి చెత్తను విక్రయిస్తున్నారు. వార్డుల్లో ఏర్పాటు చేసిన కంపోస్టు యార్డుల్లో సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేస్తున్నారు. పట్టణంలో 40కి పైగా ప్రజా శౌచాలయాలు నిర్మించారు. మహిళలకు సంచార శౌచాలయాన్ని అందుబాటులోకి తెచ్చారు. మురుగు, మానవ వ్యర్థాలను శుద్ధి చేసి ఎరువుగా మార్చే కేంద్రం, ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకలు, టైల్స్ తయారీ, తడి చెత్తతో సీఎన్జీ ఉత్పత్తి సహా 34 వార్డుల్లో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకులు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
విభాగాల వారీగా..
జాతీయస్థాయిలో అత్యధిక ప్రజా భాగస్వామ్యం (సిటిజన్ పార్టిసిపేషన్) విభాగంలో సిద్దిపేట మున్సిపాలిటీ మూడో స్థానంలో నిలవడం విశేషం. స్వచ్ఛ పట్టణాల జాబితాలో మొత్తం 4354 పట్టణాలు పోటీ పడగా.. అందులో 30వ ర్యాంకు సాధించింది. సర్వేకు 7500 మార్కులు కేటాయించగా.. బల్దియా 5540 మార్కులు సాధించింది. ఈ లెక్కన రాష్ట్రంలో లక్ష నుంచి 3 లక్షల జనాభా కలిగిన పట్టణాల పరంగా చూస్తే తెలంగాణలో ప్రథమస్థానం కైవసం చేసుకుంది. జాతీయస్థాయిలో 20వ ర్యాంకు పొందింది. గార్బేజ్ (చెత్త రహిత పట్టణం) ఫ్రీ సిటీ విభాగంలో వన్ స్టార్ రేటింగ్ను పొందింది. స్టార్ రేటింగ్ రావడం ఇదే ప్రథమం. ఓడీఎఫ్ ++ విభాగంలో గత ఏడాది పట్టణం గుర్తింపుపొందిన విషయం తెలిసిందే. ఆ స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకుంది. ప్రేరక్ డౌర్ సమ్మాన్లో భాగంగా తడి, పొడి, హానికర చెత్త సేకరణ, నిర్వహణలో మేటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో గోల్డ్ కేటగిరీలో స్థానం సంపాదించింది. ఈ సందర్భంగా బల్దియా అధ్యక్షురాలు మంజుల, కమిషనర్ రవీందర్రెడ్డి మాట్లాడుతూ..మంత్రి హరీశ్రావు ఆదేశాలకు అనుగుణంగా ముందడుగు వేసి చక్కటి ఫలితాలు సాధించామన్నారు.
ఐక్యతకు నిదర్శనం..
- హరీశ్రావు, ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖల మంత్రి
జాతీయస్థాయిలో ప్రత్యేకతను చాటడం ఆనందంగా ఉంది. పదేళ్ల కిందటి నుంచే ఎన్నో కార్యక్రమాలను అమలు చేశాం. ప్రజల భాగస్వామ్యం, కౌన్సిల్ బృందం, అధికారులు, సిబ్బంది ఐక్యతకు నిదర్శనం. రానున్న రోజుల్లో ప్లాస్టిక్ రహిత పట్టణంగా దేశంలో తొలిస్థానంలో నిలవడమే లక్ష్యంగా ముందడుగు వేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా