ఆలన.. ఊరట!
క్యాన్సర్.. ఒకానొక దశలో తగ్గని మహమ్మారిలా పీడిస్తుంది. నిర్దేశిత దశలు దాటితే.. ముప్పుగా పరిణమిస్తుంది. దీనికి చికిత్స అందించడం ఓ సుదీర్ఘమైన ప్రక్రియ. ఈ తరుణంలో ప్రధాన చికిత్సకు అనుసంధానంగా సహకార సేవలు అందించేందుకు పాలియేటివ్ కేర్ కేంద్రాలు ఉపకరిస్తాయి.
జిల్లాకు మరో పాలియేటివ్ కేర్ కేంద్రం..
న్యూస్టుడే, సిద్దిపేట
సిద్దిపేట సర్వజన ఆసుపత్రిలో సిద్ధమవుతున్న పాలియేటివ్ కేర్ కేంద్రం
క్యాన్సర్.. ఒకానొక దశలో తగ్గని మహమ్మారిలా పీడిస్తుంది. నిర్దేశిత దశలు దాటితే.. ముప్పుగా పరిణమిస్తుంది. దీనికి చికిత్స అందించడం ఓ సుదీర్ఘమైన ప్రక్రియ. ఈ తరుణంలో ప్రధాన చికిత్సకు అనుసంధానంగా సహకార సేవలు అందించేందుకు పాలియేటివ్ కేర్ కేంద్రాలు ఉపకరిస్తాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చొరవతో జిల్లాలో ఇప్పటికే గజ్వేల్లో ఓ కేంద్రం కొనసాగుతుండగా.. సిద్దిపేటకు మరొకటి మంజూరైంది. ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ సర్వజన ఆసుపత్రిలో ఈ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. క్యాన్సర్ బాధిత కుటుంబాల్లో అత్యధిక శాతం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. హైదరాబాద్లోని ఎంఎన్జే ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సహా వివిధ కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు తరచూ నిర్దేశిత ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో స్థానికంగానే సహకార సేవలు అందించేందుకు పాలియేటివ్ కేర్ కేంద్రం దోహదం చేస్తుంది. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా చితికిపోకుండా భరోసా ఇస్తుంది. బాధితులు, కుటుంబీకుల్లో ఆత్మస్థైర్యం పెంపొందిస్తారు. ఆలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 24వ కేంద్రంగా సిద్దిపేటలో ప్రారంభం కానుంది.
దీర్ఘకాలిక రోగులకు..
ఈ కేంద్రం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి సేవలు అందిస్తుంటారు. అందులో ప్రధానంగా క్యాన్సర్, పక్షవాతం, ఇతరత్రా వాటిపై ఎక్కువ దృష్టి సారిస్తారు. ఓపీ, ఐపీ, హోమ్ కేర్ సేవలు అందుతాయి. ఆసుపత్రితో పాటు ఇళ్ల వద్దకు వైద్య సిబ్బంది వెళతారు. మానసిక స్థైర్యం పెంపొందించేలా క్యాన్సర్, బాధిత కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ చేస్తారు. తీవ్రత మేర ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిందిగా సూచనలు చేస్తుంటారు. పుండు లేదా గాయం వద్ద డ్రెస్సింగ్ను స్వతహాగా చేసుకునే విధానంపై వివరిస్తారు. ప్రధాన ఆసుపత్రుల్లో చికిత్స అనంతరం నొప్పి నివారణ చర్యలు, సైడ్ ఎఫెక్ట్స్ను తగ్గించేలా చర్యలు తీసుకుంటారు. తుది దశలో ఉన్న వారికి కుటుంబ సభ్యుల మాదిరి సేవలు అందిస్తారు. గజ్వేల్లో 2018లోనే పాలియేటివ్ కేర్ కేంద్రం ఏర్పాటైంది. ఎనిమిది పడకలు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఇప్పటి వరకు 2663 మంది సేవలు పొందారు.
సేవలు విస్తృతం.. సమీపంగా..
సిద్దిపేటలో కేంద్రం ఏర్పాటుతో సేవలు సమీపంగా, విస్తృతమయ్యే అవకాశం ఏర్పడింది. సర్వజన ఆసుపత్రిలోని నాలుగో అంతస్తులో ఏడు పడకలు ఏర్పాటు చేశారు. వైద్యుడు, ఫిజియోథెరపిస్టు, నలుగురు స్టాఫ్నర్సులు సేవలు అందించనున్నారు. కేంద్రం పరిధిలో పేగు క్యాన్సర్ బాధితులకు కోలోస్టోమీ బ్యాగును మార్చడం, అవసరం మేర ఫీడింగ్ ట్యూబ్ను అమర్చడం-మార్చడం, పుండ్లకు డ్రెస్సింగ్ చేయడం, గొంతు క్యాన్సర్ బాధితులకు ట్రాకియోష్టమీ ట్యూబ్ను శుభ్రం చేయడంతో పాటు ఫిజియోథెరపీ చేయిస్తారు. వాంతులు, విరేచనాలు, నొప్పులు ఉంటే తగ్గించేందుకు ఔషధాలు అందిస్తారు. జావ, అంబలి, మెత్తటి అన్నంతో కూడిన భోజనం పంపిణీ చేస్తారు. అన్ని రకాల వసతులు అందుబాటులో ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హస్త’గతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
దివ్యమైన ఓటుకు సాక్ష్యం
[ 20-04-2024]
సాక్ష్యం యాప్లో దివ్యాంగులకు అవసరమైన సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అది ఏ స్థాయిలో ఉందో ఆరా తీయవచ్చు. -
కలెక్టరేట్ కేంద్రంగా కీలక విభాగాలు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ అంటే సామాన్యమేమీ కాదు.. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా