logo

జాతీయ రహదారిపై కారు దగ్ధం

నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగి ఇంజిన్‌ పూర్తిగా దగ్ధమైన ఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ శివారులో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

Published : 04 Oct 2022 02:56 IST

కారు నుంచి వెలువడుతున్న మంటలు

మనోహరాబాద్‌, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగి ఇంజిన్‌ పూర్తిగా దగ్ధమైన ఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ శివారులో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. కారులో ఉన్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌ వెళ్తున్న కారు కాళ్లకల్‌ శివారులోకి చేరుకోగానే ఇంజిన్‌ నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవరు అప్రమత్తమై పక్కకు నిలిపాడు. అందులో ఉన్న నలుగురు కిందకు దిగి పరిశీలించే లోపు మంటలు పూర్తిగా వ్యాపించి ఇంజిన్‌ పూర్తిగా కాలిపోయింది. నంబరు ఆధారంగా సికింద్రాబాద్‌కు చెందిన మహ్మద్‌ షహజాన్‌ అలీకి చెందిన కారని గుర్తించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద అపసవ్య దిశలో వెళ్తునప్పుడు చలానా పడినట్లు తెలిసింది. కారులో ఉన్న నలుగురికి ఎటువంటి గాయాలు కాలేదు. కారును అక్కడే వదిలేసి వారు వేరే వాహనాలలో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఈ విషయమై మనోహరాబాద్‌ ఎస్‌ఐ రాజును వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, సమాచారం లేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని