logo

కడుపునొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య

కడుపునొప్పి తాళలేక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయిలో సోమవారం చోటుచేసుకుంది. రాజగోపాలపేట ఠాణా ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి తెలిపిన వివరాలు..

Published : 04 Oct 2022 02:56 IST

నంగునూరు, న్యూస్‌టుడే: కడుపునొప్పి తాళలేక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయిలో సోమవారం చోటుచేసుకుంది. రాజగోపాలపేట ఠాణా ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన శిలాసాగరం అనిల్‌ (19) తల్లి ఎల్లవ్వ, తండ్రి పోచయ్యతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆరు నెలల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఆసుపత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆదివారం రాత్రి పంకాకు ఉరి వేసుకున్నాడు. హైదరాబాద్‌కు వెళ్లిన అనిల్‌ తల్లిదండ్రులు సోమవారం వచ్చి చూడగా విగతజీవిగా కనిపించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని