logo

వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే శ్రీ లక్షీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో.. 

Updated : 04 Oct 2022 15:23 IST

మిరుదొడ్డి : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే శ్రీ లక్షీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో..  దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జ్ఞాన సరస్వతి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో చండీ హోమం, అమ్మవారి ఊరేగింపు, మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 3 గంటల నుంచే భక్తులు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ ధర్మకర్త భాస్కర్‌రావు పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని