logo

దత్తతతో మరింత పురోగతి: మహిపాల్‌రెడ్డి

గ్రామాలు అభివృద్ధి చేయడానికి సామాజిక బాధ్యతగా పరిశ్రమలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 05 Oct 2022 00:59 IST


నీటి ట్యాంకును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, పరిశ్రమ ప్రతినిధులు, నేతలు

గుమ్మడిదల, న్యూస్‌టుడే: గ్రామాలు అభివృద్ధి చేయడానికి సామాజిక బాధ్యతగా పరిశ్రమలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బొంతపల్లి పంచాయతీ వీరభద్రనగర్‌లోని గ్రాన్యూయల్స్‌ పరిశ్రమ సాయంతో నిర్మించిన రక్షిత నీటి ట్యాంకును పరిశ్రమ ఛైర్మన్‌, ఎండీ చిగురుపాటి కృష్ణప్రసాద్‌, ఈడీ ఉమాదేవిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామాలను పరిశ్రమలు దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తే మరింత పురోగతి సాధిస్తాయని తెలిపారు. బొంతపల్లి సర్పంచి ఆలేటి నవీన, ఉపసర్పంచి సంజీవరెడ్డి, ఎంపీపీ ప్రవీణ, జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌, ఎంపీటీసీ నాగేందర్‌గౌడ్‌, మండల తెరాస అధ్యక్షుడు హుస్సేన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని