logo

విజయాల పరంపర కొనసాగాలి: మంత్రి

విజయ దశమి సందర్భంగా ప్రజలకు మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. అన్నింటా శుభం చేకూరాలని ఆకాంక్షించారు. సంస్కృతి, సంప్రదాయంతో పాటు ఆత్మీయత కలబోతగా దసరా ప్రత్యేకతను చాటుతోందన్నారు.

Published : 05 Oct 2022 00:59 IST

సిద్దిపేట, న్యూస్‌టుడే: విజయ దశమి సందర్భంగా ప్రజలకు మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. అన్నింటా శుభం చేకూరాలని ఆకాంక్షించారు. సంస్కృతి, సంప్రదాయంతో పాటు ఆత్మీయత కలబోతగా దసరా ప్రత్యేకతను చాటుతోందన్నారు. ఆనందోత్సాహాల నడుమ వేడుక చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నట్లు వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అన్నింటా విజయాలు సాధించాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు వివరించారు. ప్రజలు విజయోత్సాహంతో ముందడుగు వేయాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని