ప్రగతి పరుగెలెడితే... ఊరూరా సంబురం
ఉమ్మడి మెదక్తో పాటు వికారాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. సంక్షేమ పథకాలను విస్తృతంగా అందిస్తూ అండగా నిలుస్తోంది.
అపరిష్కృత పనులు సత్వరం పూర్తి చేస్తే మేలు
అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవ కీలకం
ఈనాడు, సంగారెడ్డి
ముత్తాయిపల్లి వద్ద మహబూబ్నహర్ కాలువ దుస్థితి
ఉమ్మడి మెదక్తో పాటు వికారాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. సంక్షేమ పథకాలను విస్తృతంగా అందిస్తూ అండగా నిలుస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా వికారాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేలా ప్రణాళికలు రూపొందించారు. కాళేశ్వరం ద్వారా సిద్దిపేట జిల్లాలో నాలుగు జలాశయాలను ఇప్పటికే నిర్మించారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కాలువల పనులు సాగుతున్నాయి. పర్యాటకంగా నాలుగు జిల్లాలనూ తీర్చిదిద్దుకునే వీలుంది. నాలుగు జిల్లాల్లోనూ ఇంకా కొన్ని చోట్ల పనులు పూర్తికాలేదు. దసరా సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సంకల్పించి.. వాటిపై దృష్టిసారించి పనులు పూర్తి చేస్తే ప్రజలకు ప్రయోజనం దక్కుతుంది.
విశ్వవిద్యాలయానికి డిమాండ్
సిద్దిపేట ప్రాంతంలో విశ్వవిద్యాలయం కావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో నాలుగు వేల మందికి పైగా విద్యార్థులు చదువుతుంటారు. ఇప్పుడు ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తుంది. స్థానికంగానే కొత్త విశ్వవిద్యాలయం ఉండాలంటూ పలువురు విద్యావేత్తలు కోరుతున్నారు. దీంతో పాటు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల కావాలనే డిమాండ్ ఉంది. ఇవి సాకారమైతే సిద్దిపేట సమగ్ర విద్యాహబ్గా మారుతుంది.
ఏళ్లుగా జాప్యం..
వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో రైల్వే వంతెన ఇరుకుగా మారింది. ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో ఉదయం, సాయంత్రం సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని విస్తరించేందుకు ఇప్పటికే రూ.12కోట్లు మంజూరయ్యాయి. అయినా పనులు మొదలుకాలేదు. త్వరితగతిన ప్రారంభించి వాహనదారులకు ఊరట కల్పించాలి.
నీళ్లందిస్తే రైతులకు ఊరట
అసంపూర్తిగా నల్లవాగు ప్రాజెక్టు కుడి కాలువ
* నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నల్లవాగు ప్రాజెక్టు ఆయకట్టు లక్ష్యం 5,330 ఎకరాలు. కల్హేర్, సిర్గాపూర్ మండలాలకు లబ్ధి జరుగుతుంది. 2017లో రూ.24కోట్లు మంజూరయ్యాయి. కాల్వల ఆధునీకరణ చేయాల్సి ఉన్నా... ఇప్పటి వరకు 50శాతమైనా పూర్తికాలేదు. చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు.
* మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్ వద్ద మంజీరా నదిపై వనదుర్గా ప్రాజెక్టు నిర్మించారు. రెండు కాలువల ద్వారా 21,625 ఎకరాలకు నీళ్లందించడం లక్ష్యం. మహబూబ్నహర్, ఫతేనహర్ కాలువల ఆధునీకరణకు సమృద్ధిగా నిధులిస్తున్నా పనులు పూర్తికావడం లేదు. అసంపూర్తి పనులకు రూ.50.32కోట్లు మంజూరైనా.. ఆనకట్ట ఎత్తు పెంపు ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.
పర్యాటకంగా తీర్చిదిద్దే అవకాశాలు
మంజీరా బ్యారేజీ
* సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో మంజీరా బ్యారేజీ ఉంది. ఇది మొసళ్ల అభయారణ్యం. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వారాంతాలు, సెలవుదినాల్లో చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. కనీస సదుపాయాలు లేకపోవడంతో వచ్చిన వారు రెండోసారి రావడానికి ఆసక్తి చూపడం లేదు.
* సిద్దిపేట జిల్లాలోని రంగనాయక్ సాగర్ను పర్యాటకంగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంది. రూ.100 కోట్లు వెచ్చించాలనుకున్నారు. ఇప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. మల్లన్నసాగర్ను ఏకోటూరిజంగా మారుస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కొండపోచమ్మ జలాశయం వద్ద ఇప్పటి వరకు నామమాత్రంగానే పనులు చేశారు. వీటిని పూర్తి చేస్తే పర్యాటకంగా జిల్లా అగ్రస్థానంలో నిలుస్తుంది.
* మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్లో దట్టమైన అడవులున్నాయి. పోచారం అభయారణ్యం ఉంది. ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి పలు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి టూరిజం సర్య్కూట్గా మార్చితే ప్రయోజనం ఉంటుంది.
* వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. దీనిని పర్యాటకంగా తీర్చిదిద్దేలా గతంలో హామీలిచ్చినా ఆ దిశగా నిర్దిష్టమైన కార్యాచరణ కొరవడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు