కీలక మార్పు.. పురోగమనం వైపు..
మెతుకుసీమ వివిధ రంగాల్లో పురోగమిస్తోంది. ఆరేళ్ల కిందట మెదక్ కేంద్రంగా జిల్లా ఆవిర్భవించగా అభివృద్ధి ఊపందుకుంది. ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో పాటు అర్హులకు సంక్షేమ పథకాలు అందుతుండటంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. కీలక రంగాలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయి.
న్యూస్టుడే, మెదక్
మాతా, శిశుసంరక్షణ కేంద్రం
మెతుకుసీమ వివిధ రంగాల్లో పురోగమిస్తోంది. ఆరేళ్ల కిందట మెదక్ కేంద్రంగా జిల్లా ఆవిర్భవించగా అభివృద్ధి ఊపందుకుంది. ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో పాటు అర్హులకు సంక్షేమ పథకాలు అందుతుండటంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. కీలక రంగాలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయి.
వైద్య మణిహారం
వచ్చే ఏడాదిలో జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటుచేయన్నారు. దీని ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. విద్యావ్యవస్థలో ఇది కీలక మార్పనే చెప్పాలి. అనుబంధంగా నర్సింగ్ కళాశాలనూ ఏర్పాటుచేసే అవకాశం ఉంది. గుండె, యూరాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాల్లో 24 గంటల పాటు నిపుణులతో సేవలు అందే అవకాశాలున్నాయి. జిల్లా కేంద్రంలో 100 పడకలతో రూ.17 కోట్లతో నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రం గత జూన్లో అందుబాటులోకి వచ్చింది. తల్లీబిడ్డలకు కార్పొరేట్ వైద్యం అందుతోంది.
విద్యావ్యవస్థలో..
ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో 313 బడులను ఎంపిక చేశారు. ఇప్పటివరకు 204 చోట్ల పనులు మొదలయ్యాయి. శౌచాలయాలు, మూత్రశాలలు, ప్రహరీ నిర్మాణం, తాగునీటి వసతి, విద్యుత్తు సౌకర్యం సమకూర్చనున్నారు. ప్రస్తుతం నాలుగు కస్తూర్బాలు మంజూరయ్యాయి. నిజాంపేట, మాసాయిపేట, నార్సింగి, హవేలిఘనపూర్ మండలాల్లో ఏర్పాటు కానున్నాయి. ఇటీవల మెదక్కు ఫులే బాలుర గురుకుల డిగ్రీ కళాళాల, బాలికల గురుకుల పాఠశాల కేటాయించారు.
ఆర్థికాభివృద్ధి దిశగా..
జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు సెర్ప్, స్త్రీనిధి ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలతో పాటు పాడిగేదెలు ఇస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2,648 మంది కొత్త వ్యాపారాలు ప్రారంభించగా, ప్రస్తుతం 2,733 మందిని గుర్తించారు. గత ఆర్థిక సంవత్సరంలో 9,375 సంఘాలకు రూ.469.14 కోట్ల బ్యాంకులు రుణాలు ఇవ్వగా, జిల్లా రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 11,486 సంఘాలకు రూ.491.85 కోట్లు ఇవ్వాలన్నది లక్ష్యం. ఇప్పటివరకు 2,956 సంఘాలకు రూ.164.06 కోట్లు ఇచ్చారు.
ఉపాధికి అడుగులు
మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట, చిన్నశంకరంపేట, శివ్వంపేట మండలాల్లో వివిధ పరిశ్రమలు ఉన్నాయి. టీఎస్-ఐపాస్ ద్వారా 699 యూనిట్లకు 1,833 దరఖాస్తులు రాగా, వాటిలో 1,518 అనుమతులిచ్చారు. 2022-23 సంవత్సరానికి 91 పరిశ్రమల్లో ఎస్సీ, ఎస్టీ రాయితీల ద్వారా రూ.7.39 కోట్లతో 182 మందికి ఉపాధి కల్పించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన ప్రోగ్రాం ద్వారా 2022-23 సంవత్సరానికి 10 యూనిట్లకు రూ.21.74 లక్షల రుణాలను లబ్ధిదారులకు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు