వంతెన నిర్మించారు.. రోడ్డు మరిచారు!
వంతెనలు నిర్మించిన ఏడాది కావస్తున్నా రహదారులను నిర్మించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
న్యూస్టుడే, శివ్వంపేట
చెన్నాపూర్ వద్ద..
వంతెనలు నిర్మించిన ఏడాది కావస్తున్నా రహదారులను నిర్మించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఇరుకు వంతెనలతో ఇబ్బందులు ఏర్పడటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసి వాటిని విస్తరింపజేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా వాటికి ఇరువైపులా రహదారులను అలాగే వదిలేయడంతో పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
నాలుగేళ్ల కిందట..
శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల నుంచి మనోహరాబాద్, జీడిపల్లి వెళ్లేందుకు గతంలో ఒకే వరుస దారి ఉండటంతో దాన్ని రెండు వరుసలకు విస్తరించారు. నాలుగేళ్ల కిందట రూ.15 కోట్లతో 12 కి.మీ. మేర పనులు చేపట్టి పూర్తిచేశారు. ఈ మార్గంలో చెన్నాపూర్, గోమారం గ్రామాల వద్ద కొత్త వంతెనలు నిర్మించారు. చెన్నాపూర్ వద్ద రూ.1.80 కోట్లు వెచ్చించి నిర్మాణం చేపట్టి గత డిసెంబరులో పూర్తిచేశారు. గోమారం వద్ద రూ.1.30 కోట్లతో ఫిబ్రవరిలో వంతెన పూర్తయింది. ఇంతవరకు ఆయా వంతెనలకు ఇరువైపులా రహదారులను మాత్రం మరచిపోయారు. మట్టి వేసి కంకర పోశారు. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు మట్టి కుంగిపోయి గుంతలమయమైంది. ఇప్పుడా దారిలో వెళ్తున్న వాహనాలు అదుపు తప్పుతున్నాయి.
* చెన్నాపూర్ వద్ద వంతెనపై నుంచి ఓ కారు అదుపు తప్పి కిందకు దూసుకొచ్చి పలువురికి గాయాలైన ఘటన ఇటీవల జరిగింది. కొత్త నిర్మాణం వద్ద ఇరువైపులా బీటీ నిర్మాణం చేయకపోవడంతో కంకర దారి అధ్వానంగా మారింది. గుంతల కారణంగా వాహనాలు వాటిల్లో పడి అదుపు తప్పి పడిపోతున్నాయి. వెంటనే బీటి రోడ్డు నిర్మించి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు విన్నవిస్తున్నారు.
వంతెనపై నుంచి కింద పడ్డ కారు
త్వరలోనే రహదారి నిర్మిస్తాం : - శ్రీనివాస్, డీఈ, ఆర్అండ్బీ
చెన్నాపూర్, గోమారం గ్రామాల్లో వంతెనల వద్ద మట్టి దారులు అధ్వానంగా మారాయి. ప్రస్తుతం పాత రోడ్డు గుత్తేదారుతోనే పనులు చేయిస్తాం. వర్షాలు పూర్తిగా తగ్గాక బీటీ నిర్మింపజేస్తాం. సమస్య తీరుస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?