logo

సంగారెడ్డిలో బాణసంచా పేలుడు ఘటనలో యువకుడు మృతి

సంగారెడ్డిలో ఓ యువకుడు టపాసులు పేలడంతో గాయపడి మృతిచెందాడు. వైద్య కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా తెరాస నిర్వహించిన ర్యాలీలు బాణసంచా ఉన్న వాహనంలో నిప్పురవ్వలు పడి ఒక్కసారిగా పేలాయి. దీంతో యువకుడు గాయపడ్డాడు.  

Published : 15 Nov 2022 23:33 IST

సంగారెడ్డి: సంగారెడ్డిలో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన యువకుడు మృతిచెందాడు. వైద్య కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా తెరాస నిర్వహించిన ర్యాలీలో టపాసులు పేల్చారు. దీంతో బాణసంచా వాహనంలో నిప్పురవ్వలు పడడంతో ఒక్కసారిగా టపాసులు పేలాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. దీంతో వీరిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిలో  ఖుషీల్‌ అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని