జమవుతున్న నిధులు.. తీరనున్న ఇబ్బందులు
పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంఘం నిధులను జనాభా ప్రాతిపదికన కేటాయిస్తున్నాయి.
న్యూస్టుడే, మెదక్
పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంఘం నిధులను జనాభా ప్రాతిపదికన కేటాయిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా గ్రామ ప్రత్యేక ఖాతాల్లోనే నిధులను జమచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సందర్భంగానే సర్పంచులతో శూన్య ఖాతాలను తెరిపించింది. గత కొన్ని నెలలుగా నిధులు రాలేదు. తాజాగా జిల్లాకు కొన్ని నిధులు విడుదల అయ్యాయి. స్థానిక సంస్థలకు వివిధ పథకాల కింద వచ్చే నిధులు, ఖర్చులను పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్రం పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్కు అనుసంధానంగా బ్యాంకు ఖాతాలు సక్రమంగా ఉన్నాయా? లేవా? అని తెలుసుకునేందుకు పంచాయతీల ఖాతాలో నిధులను జమచేసింది. వీటికి సంబంధించిన డిజిటల్ కీలను సర్పంచి, ఉపసర్పంచులకు ఇచ్చారు. ప్రస్తుత ఏడాదిలో మంజూరు కావాల్సిన నిధుల్లో 10 శాతం మాత్రమే విడుదల చేశారు..
ఇప్పటివరకు 429 పంచాయతీల్లో
మిగతావి మంజూరు కావాలంటే పీఎఫ్ఎంఎస్లో ఓచర్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. వీటిని ఏజెన్సీలు, రెసిడెన్సీలు, పంచాయతీ ఉద్యోగులుగా విభజించి ఆన్లైన్ చేయాలి. ఆ తర్వాతే చెక్కులను వారి పేరిట అందజేస్తారు. జిల్లాలో 469 పంచాయతీలున్నాయి. వీటికి పల్లె ప్రగతి కింద, కేంద్రం ఇచ్చే 15వ ఆర్థికసంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కలిపి మొత్తం ప్రతి నెలా రూ.6.73 కోట్లు మంజూరవుతాయి. కొత్తగా తెరిచిన ఖాతాల్లో నిధులను జమచేసేందుకు కేంద్రం తాజాగా జిల్లాకు రూ.12 లక్షలు విడుదల చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 429 పంచాయతీల్లో నిధులు జమయ్యాయి. సాంకేతిక కారణాల వల్ల మిగతా వాటిల్లో కాలేదు. వాటిని అధికారులు సరిచేస్తున్నారు.
ఖాతాల స్తంభన లేదిక
మొన్నటి వరకు పంచాయతీల ఖాతాలు స్తంభించిపోవడంతో సర్పంచులు అవస్థలు ఎదుర్కొన్నారు. డబ్బులున్నా ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించడంతో వీరి ఖాతాలను మూడు, నాలుగు నెలల పాటు ఇలాగే జరేగిది. చేసిన పనులకు చెక్కులు పాస్ చేయించుకునేందుకు ఖజానా కార్యాలయానికి వెళితే తరచూ ఈ సమస్యే ఎదురయ్యేది. దీంతో సర్పంచులు అప్పులు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం నేరుగా రానుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతాలను పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్(పీఎఫ్ఎంఎస్)కు అనుసంధానం చేస్తారు. అనంతరం కేంద్రం నుంచి వచ్చే నిధులు 10 రోజుల వ్యవధిలోనే ఈగ్రామ్ స్వరాజ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో చెల్లింపు చేయాల్సి ఉంటుంది.
అవగాహన కల్పిస్తున్నాం
- తరుణ్కుమార్, జిల్లా పంచాయతీ అధికారి
ఆర్థికసంఘం నిధులను నేరుగా జమచేసేందుకు పంచాయతీలు తెరిచిన బ్యాంకు ఖాతాల్లో నగదు జమవుతోంది. ప్రయోగాత్మకంగా చెల్లింపులకు నిధులు విడుదలయ్యాయి. అన్ని సక్రమంగా ఉన్న వాటికే ఇవి చేరాయి. మిగతా వాటిలో సాంకేతిక సమస్యలు సరిచేశాక జమచేస్తారు. దీనిపై పాలకవర్గాలు, కార్యదర్శులకు అవగాహన కల్పిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ