మాట వినకుంటే..మూత తప్పదు!
జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పరిశ్రమలున్నాయి. కాలుష్య కారకాలే అధికం. వాయు, జల, శబ్దకాలుష్యాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.
కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో పీసీబీ బృందాల తనిఖీ
జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిక
ఐఐటీ హైదరాబాద్ ఆవరణలో ఏర్పాటు చేసిన గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రం
ఈనాడు, సంగారెడ్డి: జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పరిశ్రమలున్నాయి. కాలుష్య కారకాలే అధికం. వాయు, జల, శబ్దకాలుష్యాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. చలికాలం వస్తే చాలు.. చాలా చోట్ల ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. ఎక్కువ సమయం ఇలాంటి గాలిని పీల్చితే తలతిరగడం, వాంతులవడం లాంటి సమస్యలు వస్తాయి. ప్రధానంగా పాశమైలారం, బోర్పట్ల, గుండ్లమాచనూరు, కొండాపూర్, పటాన్చెరు, జహీరాబాద్ ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉంది.
ఏడు ప్రత్యేక బృందాలు
కాలుష్య తీవ్రత అధికంగా ఉండే హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు సంగారెడ్డి జిల్లాలోనూ నిత్యం పర్యవేక్షణకు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలో 14 మంది అధికారులున్నారు. ఫిర్యాదు అందడమే ఆలస్యం.. సంబంధిత ప్రాంతానికి వెళ్లి గాలి నాణ్యతను పరీక్షిస్తున్నారు. ఉల్లంఘనలు గుర్తిస్తే సంబంధిత పరిశ్రమల నుంచి బ్యాంకు గ్యారెంటీని జప్తు చేయడంతో పాటు మూసేసేలా చర్యలుంటున్నాయి. గతేడాది పటాన్చెరు నియోజకవర్గంలోని రెండు పరిశ్రమలకు మూసివేతకు ఉత్తర్వులు ఇచ్చారు.
అక్టోబరు మొదట్లోనే ప్రణాళిక
చలికాలం రావడానికి ముందుగానే పీసీబీ అధికారులు ఈసారి కార్యాచరణ రూపొందించారు. కాలుష్య కారక పరిశ్రమలన్నింటినీ హెచ్చరించారు. ఘాటైన వాసనలు వెలువకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బంది కలిసి పరిశ్రమలకు వెళ్లి అక్కడ చేసిన ఏర్పాట్లనూ పరిశీలించారు. ఫార్మా, ఇతరత్రా పరిశ్రమల్లో ప్రత్యేక సెన్సార్లను అమర్చారు. నిర్వహణలో ఏదైనా తేడా ఉంటే ఇవి పసిగడతాయి. అధికారులూ ఆన్లైన్ ద్వారా ఈ డాటాను చూసుకోవచ్చు.
ఐఐటీ, ఇక్రిశాట్లలోనూ సమస్య
ఐఐటీలో ఆచార్యులు వారి కుటుంబాలతో ప్రాంగణంలోని బహుళ అంతస్తుల భవనాల్లో నివాసముంటారు. ఇక్రిశాట్లోనూ చాలా మంది ఉంటారు. ఘాటైన వాసనల వల్ల సమస్యలు వస్తున్నాయని చాలా సార్లు ఈ సంస్థల నుంచి కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు అందాయి. ఇక్రిశాట్, ఐఐటీ ప్రాంగణాల్లో గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు నమోదు చేసే యంత్రాలను బిగించారు.
మీరూ ఫిర్యాదు చేయవచ్చు
మీ ప్రాంతంలో ఘాటైన వాసనలతో ఇబ్బంది పడుతున్నా... జల, శబ్దకాలుష్య సమస్య ఉన్నా.. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. 10741 టోల్ఫ్రీ నంబరు ద్వారా సమాచారమిస్తే పీసీబీ సిబ్బందిని పంపి విచారణ చేయిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
ద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం