వనితల చొరవ కొనుగోళ్లలో హవా!
ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోళ్లలో జిల్లా ఐకేపీ మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు.
కమీషన్ రూపేణా లబ్ధి పొందుతున్న ఐకేపీ మహిళలు
శనిగరంలో ధాన్యం తూకం వేయిస్తూ..
న్యూస్టుడే, హుస్నాబాద్, హుస్నాబాద్ గ్రామీణం, కోహెడ గ్రామీణం: ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోళ్లలో జిల్లా ఐకేపీ మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. కమీషన్ రూపంలో అందుతున్న ఆదాయంతో లబ్ధి పొందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చినప్పటి నుంచి ఆరబెట్టడం, వర్షం నుంచి తడవకుండా సూచనలు, సలహాలు ఇవ్వడం.. తేమశాతం చూడటం, ఎప్పటికప్పుడు తూకాలు వేయించడం అనంతరం మిల్లులకు తరలిస్తున్నారు. కేంద్రాలను సమన్వయంతో నిర్వహిస్తూ కష్టపడి ఫలితం పొందుతున్నారు. మొదట్లో పదుల సంఖ్యలో మొదలైన కొనుగోలు కేంద్రాలు ప్రస్తుతం 225కు చేరడం విశేషం. ఏటా రెండు సీజన్లు కలిపి సుమారు రూ.40లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తుండగా కోట్లలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. అధికమొత్తంలో కమీషన్ పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆరేళ్లుగా నిర్వహిస్తున్నాం..
ఆరేళ్లుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. గతేడాది వానాకాలం సీజన్లో 318 మంది రైతుల నుంచి 14,083, యాసంగిలో 342మంది నుంచి 14,217 క్వింటాళ్లు కొనుగోలు చేశాం. వీటికి సంబంధించి ఈ ఏడాది ఆగస్టులో కొంత కమీషన్ ఇచ్చారు. ఇంకా రావాల్సి ఉంది.
బెక్కంటి అనిత, జనగామ వీఓఏ
ఓర్పు అవసరం..
మూడేళ్ల నుంచి కొనుగోళ్లు చేస్తున్నాం. మా వీవోఏ పుల్లె లక్ష్మి కీలకపాత్ర పోషిస్తున్నారు. గతేడాది రెండు సీజన్లు కలిపి 392మంది రైతుల నుంచి 17,468 క్వింటాళ్ల ధాన్యం కొన్నాం. తూకం వేయడం, మిల్లుకు తరలింపు విషయంలో ఇబ్బందులు, రాజకీయ ఒత్తిడి ఉంటుంది. వాటన్నింటిని ఓపికతో పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నాం.
- వంగ రమ్యశ్రీ, పోతారం(ఎస్) వీవో అధ్యక్షురాలు
ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నాం..
ఈ సీజన్లో ధాన్యం కొనుగోలుకు 121 కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశాం. నిర్వాహకులు, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నాం. ఇప్పటి వరకు 8.21లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశాం. రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చూస్తున్నాం.
కరుణాకర్, డీపీఎం(మార్కెటింగ్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె