బృందంగా అడుగేసి.. అండగా నిలిచి..
కేవలం రుణాలు తీసుకొని స్వయం ఉపాధి పొందడమే కాకుండా అన్నదాతలకూ అండగా నిలుస్తున్నారు స్వయం సహాయక సంఘాల మహిళలు. ఆరుగాలం శ్రమించి పండించే పంటను కొనుగోలు చేస్తూనే, మరోవైపు కమీషన్ పొందుతున్నారు.
ధాన్యం కొనుగోలులో దూసుకెళ్తున్న మహిళా సంఘాలు
న్యూస్టుడే, మెదక్
వెంకటాయిపల్లిలో..
కేవలం రుణాలు తీసుకొని స్వయం ఉపాధి పొందడమే కాకుండా అన్నదాతలకూ అండగా నిలుస్తున్నారు స్వయం సహాయక సంఘాల మహిళలు. ఆరుగాలం శ్రమించి పండించే పంటను కొనుగోలు చేస్తూనే, మరోవైపు కమీషన్ పొందుతున్నారు. వచ్చిన డబ్బు సంఘం ద్వారా అప్పులిచ్చి, వాటిపై వచ్చే వడ్డీతో ముందుకు సాగుతుండటం విశేషం.
అన్నింటా..
మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి రుణాలు పొంది సొంత వ్యాపారం, కుటుంబ అవసరాలకు వినియోగిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఇలా ముందుడుగు వేసిన వీరికి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల బాధ్యత అప్పగించింది. ఏటా ఖరీఫ్, రబీలలో వరి దిగుబడులను ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ) ఆధ్వర్యంలో కొంటున్నారు. గన్నీ సంచులు, తేమ కొలిచే, తూకం వేసే యంత్రాలు, టార్పాలిన్లు, కనీస వసతులు కల్పించడం వీరి బాధ్యత. కేంద్రానికి వచ్చే ధాన్యాన్ని కొని లారీల్లో మిల్లులకు పంపించడం, ట్రక్షీట్ రూపొందించడం, మిల్లుకు చేరాక ట్యాబ్లో వివరాలు నమోదు వంటివి నిరంతరం కొనసాగిస్తున్నారు.
కమీషన్తో నిర్వహణ..
ధాన్యం సేకరణకు ఐకేపీ మహిళలకు క్వింటాకు రూ.32 కమీషన్ అందుతుంది. ఇందులో 90 శాతం గ్రామసంఘానికి, 10 శాతం జిల్లా సమాఖ్యకు చేరుతుంది. వచ్చే కమీషన్లో 40 శాతం మేర వ్యయమవుతాయి. ఇలా గ్రామసంఘం ఖాతాల్లో జమైన డబ్బును అప్పుగా అందజేస్తున్నారు. వాటిపై వచ్చే వడ్డీతో సంఘాన్ని నడిపిస్తున్నారు. 11 సీజన్లలో సంఘాల మహిళలకు రూ.13.78 కోట్లు కమీషన్గా సంపాదించగా, ఇప్పటి వరకు రూ.7.36 కోట్లు జమయ్యాయి. 2020-21 ఖరీఫ్ సీజన్కు సంబంధించి రూ.5.38 కోట్లు రావాల్సి ఉంది. ఈ విషయమై డీపీఎం మోహన్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో సంఘాల మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో పాటు ఉన్న సమస్యలను తొలగించి, సకాలంలో కొనుగోలు, ట్యాబ్ నమోదు, ఖాతాల్లో నగదు జమపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. కమీషన్తో సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయని వివరించారు.
43 లక్షల క్వింటాళ్లు..
జిల్లా ఆవిర్భావం నుంచి ఐకేపీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 43 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 2017-18 ఖరీఫ్ నుంచి ప్రక్రియ మొదలైంది. ఆరంభంలో 52 కేంద్రాలు ఏర్పాటు చేయగా 2.30 లక్షల టన్నుల మేర కొనుగోలు చేయగా, రూ.73.87 లక్షలు కమీషన్ పొందారు. ఆ తర్వాత సీజన్ల వారీగా కేంద్రాలను పెంచుతూ వచ్చారు. 2020-21 రబీలో 9.51 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. ప్రస్తుత ఖరీఫ్లో 106 కేంద్రాలు అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పటి వరకు 10,838 మంది నుంచి రూ.106.59 కోట్ల విలువైన 5.17 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.