నాయకత్వం.. ప్రజాచైతన్యం!
విద్యార్థి దశ నుంచే సమాజం గురించి ఆలోచించాలి. అప్పుడే సమసమాజానికి బాటలు పడతాయి. విద్యార్థుల్లో సామాజిక దృక్పథాన్ని అలవర్చాలన్న సంకల్పంతో ప్రారంభించిందే జాతీయ సేవా పథకం. డిగ్రీ విద్యార్థులు ఇందులో వాలంటీర్లుగా ఉంటారు.
డిగ్రీ కళాశాలల్లో ఒయాసిస్ మిజల్ ప్రాజెక్టుకు శ్రీకారం
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, మెదక్ టౌన్, సిద్దిపేట, వికారాబాద్ టౌన్
విద్యార్థి దశ నుంచే సమాజం గురించి ఆలోచించాలి. అప్పుడే సమసమాజానికి బాటలు పడతాయి. విద్యార్థుల్లో సామాజిక దృక్పథాన్ని అలవర్చాలన్న సంకల్పంతో ప్రారంభించిందే జాతీయ సేవా పథకం. డిగ్రీ విద్యార్థులు ఇందులో వాలంటీర్లుగా ఉంటారు. చదువుతో పాటు సమాజంలో మార్పు, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కృషి చేస్తారు. ఇప్పటికే వివిధ రూపాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఒయాసిస్ మిజల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం విశేషం.
ప్రాజెక్టు రూపకల్పన ఇలా..
గుజరాత్లోని వడోదరలో ఓయాసిస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల పెంపు, ప్రతిభకు పదను పెట్టే కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. తద్వారా యువతలో మార్పునకు బాటలు పడ్డాయి. దీన్ని గమనించిన రాష్ట్ర కళాశాల విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించారు. ఇందుకు అనుగుణంగా ఒయాసిస్ మిజల్ పేరు ప్రాజెక్టు అమలుపై ఉత్తర్వులు జారీచేశారు.
పర్యవేక్షణ బృందాలు..
కళాశాలల్లో అమలుచేస్తున్న ఒయాసిస్ మిజల్ ప్రాజెక్టు సక్రమంగా సాగేలా పర్యవేక్షణ బృందాలనూ ఏర్పాటుచేశారు. కేంద్ర, ప్రాంతీయ బృందాలు ఉంటాయి. ఆచార్యులు, సహాయ ఆచార్యులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలోనూ కార్యక్రమ అధికారులు ఉంటారు. సంగారెడ్డి జిల్లాకు తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి పద్మజ, మెదక్కు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి విశ్వనాథం, సిద్దిపేటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల(సిద్దిపేట) ఎన్ఎస్ఎస్ అధికారి భైరయ్య, వికారాబాద్కు కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి సోమ్లా పర్యవేక్షణ అధికారులుగా వ్యవహరించనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి: ప్రవీణ, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్
ఒయాసిస్ మిజల్ ప్రాజెక్టుతో విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లంతా భాగస్వాములు కావాలి. పోటీల్లో పాల్గొని తమ ప్రతిభ చాటాలి. కళాశాలల్లో అత్యధికులు ముందుకొచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని అంశాల్లో చురుగ్గా ఉండటం అవసరం.
మూడు విడతల్లో..
ప్రాజెక్టును మూడు విడతల్లో అమలు చేస్తారు. తొలి విడతలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. దేశభక్తి, సామాజిక అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు. కళాశాలల్లోనే విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. రెండో దాంట్లో విడతలో బృంద చర్చలు ఉంటాయి. తమకు కేటాయించిన అంశంపై మాట్లాడాల్సి ఉంటుంది. ఇందులో నిర్దేశించిన అంశంపై విద్యార్థులు ధైర్యంగా మాట్లాడేలా, తమ మనసులోని భావాలను వ్యక్తంచేసేలా ప్రోత్సహిస్తారు. మూడో విడతలో ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రణాళికలు తయారు చేస్తారు. సృజనాత్మకంగా ఉండేలా దిశా నిర్దేశం చేస్తారు. అనంతరం వాటిని ప్రదర్శిస్తారు. ఇలా విద్యార్థుల్లో ప్రతిభ వెలికి తీయడంతో పాటు పాటు నాయకత్వల లక్షణాలు పెంపొందించేలా ఆయా పోటీలు కొనసాగిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ