ఉద్యానం...ఆహ్లాదం గగనం
ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు వార్డుల్లో పట్టణ ప్రకృతి వనాలు(పార్కుల) నిర్మించాలని నిర్ణయించారు
సంఖ్య ఘనం.. వసతులు శూన్యం
రూ.లక్షలు ఖర్చు చేసినా వినియోగంలోకి రాని పట్టణ ప్రకృతి వనాలు
జహీరాబాద్ సాయిరాం నగర్ కాలనీలో అధ్వానంగా..
ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు వార్డుల్లో పట్టణ ప్రకృతి వనాలు(పార్కుల) నిర్మించాలని నిర్ణయించారు. అధికారుల నిర్లక్ష్యం.. నిధులు పూర్తి స్థాయిలో కేటాయించక పోవడంతో ఇవి ప్రజలకు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడం లేదు. కొన్ని చోట్ల ప్రారంభించకుండా తాళాలు వేయగా.. మరికొన్ని చోట్ల అరకొర వసతులతో సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కథనం.
అధికారులు దృష్టి సారిస్తేనే..
ప్రజలకు ఆహ్లాదమే లక్ష్యంగా పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. లక్షలాది రూపాయలు వెచ్చించినా ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. అధికారులు స్పందించి చిన్నపాటి మరమ్మతులు చేయిస్తే వినియోగంలోకి తీసుకురావచ్చు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఈ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
* జహీరాబాద్లో సాయిరాంనగర్, ఆదర్శనగర్, చెన్నారెడ్డినగర్ కాలనీతో పాటు 21 పార్కులను అభివృద్ధి చేశారు. వీటిలో మూడు మాత్రమే బాగున్నాయి. మిగితా చోట్ల మొక్కలు నాటి వదిలేశారు. నడక దారి, చిన్న పిల్లలు ఆడుకునేందుకు సౌకర్యాలు కల్పించలేదు.
* సదాశివపేటలో 20 ప్రకృతి వనాలు నిర్మించారు. ఇక్కడ మొక్కలు నాటి వదిలేశారు. నడక దారులు, పిల్లలు ఆడుకునేందుకు వస్తువులు చాలా చోట్ల ఏర్పాటు చేయలేదు. కొన్ని చోట్ల నాటినా.. వాటిని సంరక్షించకపోవడంతో ఎండిపోతున్నాయి. నిర్వహణ ధ్వానంగా మారింది.
జిల్లా కేంద్రంలోనూ నిర్లక్ష్యం
సంగారెడ్డి పట్టణం 29వ వార్డు పరిధి చాణక్యపురి కాలనీలో ఏడాది క్రితం రూ.10 లక్షలతో పార్కు నిర్మించారు. చిన్న పాటి వనులు చేస్తే వినియోగించే అవకాశం ఉన్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. గేటుకు తాళం వేయడంతో ప్రజలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అందులో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. 28వ వార్డు శాంతి నగర్లోని మహిళా పార్కు నిర్వహణ అధ్వానంగా మారింది. మంజీరానగర్లోనూ నిర్వహణ సరిగా లేదు.
బొల్లారం, అందోలు-జోగిపేటలో..
* అందోలు-జోగిపేటలో ఐదు చోట్ల ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ప్రభు మందిరం సమీపంలో ప్రకృతి వనాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇక్కడ నాటిన కొన్ని మొక్కలు ఎండిపోయాయి. గేటు సరిగా లేకపోవడంతో పందులు సంచారం చేస్తున్నాయి.
* బొల్లారంలోని శ్రీరాంనగర్ కాలనీ పక్కనున్న పట్టణ ప్రకృతి వనం అధ్వానంగా ఉంది. మొక్కలు సరిగా లేవు. గేటు నామమాత్రంగా ఏర్పాటు చేయడంతో పందులు తిరుగుతున్నాయి. ప్రజల ఆహ్లాదానికి అనువుగా ఏర్పాట్లు లేవు. సౌకర్యాలు కల్పిస్తే వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్