ఆపసోపాలు తప్పేలా ఆధునికీకరణ!
అరకొర నిధులతో కేవలం కొంత వరకే సిమెంట్ లైనింగ్ పనులు పూర్తిచేయడంతో చివరి ఆయకట్టుకు నీరందక రైతులకు అవస్థలు తప్పలేదు. రెండు పంటల సాగుకు ఆపసోపాలు పడ్డారు.
ఎంఎన్ కెనాల్ పనులు ప్రారంభం
మహబూబ్నహర్ కాలువ
న్యూస్టుడే, మెదక్, హవేలిఘనపూర్: అరకొర నిధులతో కేవలం కొంత వరకే సిమెంట్ లైనింగ్ పనులు పూర్తిచేయడంతో చివరి ఆయకట్టుకు నీరందక రైతులకు అవస్థలు తప్పలేదు. రెండు పంటల సాగుకు ఆపసోపాలు పడ్డారు. ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే సమయంలో కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగించేందుకు అగచాట్లు పడాల్సి వచ్చేది. ఏటా ఇదే పరిస్థితి. ఎట్టకేలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కాలువ ఆధునికీకరణ పనులు షురూ అయ్యాయి.
21,625 ఎకరాలు..
ఘనపూర్ ప్రాజెక్టు ఏటా రెండు పంటలకు సాగు నీరందిస్తోంది. మంజీరాపై 0.2 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కొల్చారం మండలం చిన్నఘనపూర్ వద్ద ఆనకట్ట నిర్మించారు. మెదక్, హవేలిఘనపూర్, కొల్చారం, పాపన్నపేట మండలాల్లో 21,625 ఎకరాల ఆయకట్టును స్థీరికరించారు. దీని కింద మహబూబ్నహర్ (ఎంఎన్), ఫతేనహర్ (ఎఫ్ఎన్) కాలువలు ఏర్పాటుచేశారు. ఎంఎన్ కెనాల్ ద్వారా మెదక్, హవేలిఘనపూర్, కొల్చారం మండలాలకు, ఎఫ్ఎన్ ద్వారా పాపన్నపేట మండలంలోని చివరి ఆయకట్టుకు సాగు నీరందేలా కాలువలు నిర్మించారు. సింగూరు ప్రాజెక్టులో 0.4 టీఎంసీల వాటా ఉండగా, ఏడాదిలో ఖరీఫ్, రబీలలో నీటిని ఘనపూర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తుంటారు.
సిమెంట్ లైనింగ్..
టెండరు దక్కించుకున్న గుత్తేదారు ముత్తాయిపల్లి వద్ద పనులు మొదలుపెట్టారు. సిమెంట్ లైనింగ్ చేపట్టారు. నక్కవాగు నుంచి పోచమ్మరాల్ వరకు 10 కి.మీ. మేర ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. సిమెంట్ లైనింగ్తో పాటు బొల్లారం మత్తడి వద్ద రెండు, పోచమ్మరాల్ వరకు మరో నాలుగు పాత వంతెనలు తొలగించి కొత్తవి నిర్మించనున్నారు.
* ఫతేనహర్ ప్రధాన కాలువ 12.8 కి.మీ.కు గాను 12 కి.మీ. సిమెంట్ లైనింగ్ పూర్తవగా, 27 కి.మీ. డిస్ట్రిబ్యూషన్ కాలువలు ఉన్నాయి. ప్రస్తుత నిధులతో వీటినీ ఆధునికీకరించనున్నారు. దీనిపై నీటిపారుదలశాఖ డీఈఈ శివనాగరాజు మాట్లాడుతూ.. పనులు త్వరగా పూర్తిచేసి రైతులకు వెతలు తప్పిస్తామని చెప్పారు.
రూ.55 కోట్లతో..
ప్రాజెక్టు పరిధి రెండు కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందాలంటే సిమెంట్ లైనింగ్ చేపట్టాలి. తెరాస ప్రభుత్వం వచ్చాక జైకాతో పాటు ఇతర నిధులను కేటాయించారు. 43 కి.మీ. పరిధి ఉన్న మహబూబ్నహర్ కాలువ పనులను 32 కి.మీ. వరకు పూర్తి చేశారు. కొల్చారం, మెదక్ మండలాల్లో పనులు పూర్తవగా, హవేలిఘనపూర్ మండలం నక్కవాగు వద్ద నిలిచిపోయాయి. ఇవి పూర్తయితేనే హవేలిఘనపూర్ మండలం ముత్తాయిపల్లి, శాలిపేట, జక్కన్నపేట మీదుగా పోచమ్మరాల్ వరకు నీళ్లు అందుతాయి. ఎంఎన్ కెనాల్ మిగిలిన ఆధునికీకరణ, పాపన్నపేట మండలంలో డిస్ట్రిబ్యూషన్ కాలువల మరమ్మతులకు రూ.55 కోట్లతో గతేడాది నీటిపారుదలశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. బడ్జెట్లో నిధులు కేటాయించగా.. కొద్దినెలల క్రితం వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?