చిరుత దాడి.. బెంబేలెత్తిన జనం
మండలంలోని నత్నాయిపల్లి సమీపంలోని అటవీప్రాంతంలో పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. పొలంలో కట్టేసిన మూడు గేదె దూడలపై దాడి చేసి చంపింది.
ఘటనాస్థలిలో పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు
నర్సాపూర్ రూరల్: మండలంలోని నత్నాయిపల్లి సమీపంలోని అటవీప్రాంతంలో పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. పొలంలో కట్టేసిన మూడు గేదె దూడలపై దాడి చేసి చంపింది. రైతు అటవీశాఖ అధికారులు తెలిపిన ప్రకారం వివరాలు.. సంగన్నగారి ప్రవీణ్కుమార్ పొలం వద్ద పాడి గేదెలను ఉంచి పాలు తీసుకుని వస్తాడు. ఎనిమిది పాడి గేదెలు, మూడు దూడలు ఉన్నాయి. సోమవారం రాత్రి పాలు తీసుకుని వచ్చాడు. మంగళవారం ఉదయం వెళ్లగా దూడలు కనిపించలేదు. సమీపంలోని ఓ చెట్టుపై రెండు దూడలు వేలాడుతున్నాయి. మరికొంత దూరంలో మరో దూడ కళేబరం ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సెక్షన్ అధికారి బాలేశం, బీట్ అధికారి ప్రశాంత్కుమార్ ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించి చిరుతగా గుర్తించారు. ఉన్నతాధికారులకు నివేదిస్తామని, బాధితుడికి నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. ఈ ఘటనతో నత్నాయిపల్లి గ్రామస్థులు ఒక్కసారిగా భయందోళన చెందుతున్నారు. రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ఒబెరాయ్ సంస్థకు 40 ఎకరాలు!
-
Ap-top-news News
Vande Bharat Express: ‘వందే భారత్’ వచ్చినప్పుడే కాపలానా?
-
Ap-top-news News
రుషికొండపై వేంగి బ్లాక్ పూర్తికి టెండర్లు.. అక్కడే సీఎం క్యాంపు కార్యాలయం!
-
World News
US-China: 2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!