తిరుగుడు తిప్పలు... తప్పుతున్నాయ్!
ధరణి ద్వారా పట్టాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. సాంకేతిక సమస్యల కారణంగా తలెత్తిన లోపాలను సవరించే పనిలో నిమగ్నమైంది.
ధరణి సమస్యలు వేగంగా పరిష్కారం
కలెక్టరేట్లో ప్రజలనుండి అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు
ఈనాడు, సంగారెడ్డి: ధరణి ద్వారా పట్టాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. సాంకేతిక సమస్యల కారణంగా తలెత్తిన లోపాలను సవరించే పనిలో నిమగ్నమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్ శరత్ ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కలెక్టరేట్లో దాదాపు 12 రోజులకు పైగా సాగుతున్న కార్యక్రమం ద్వారా రికార్డు స్థాయిలో పరిష్కారం చూపుతున్నారు. తమ బాధలను తీర్చాలని నెలల తరబడి ప్రదక్షిణలు చేసినా, పరిష్కారం కాని వాటికి రోజుల వ్యవధిలోనే మోక్షం లభిస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫోన్లు చేసి కృతజ్ఞతలు చెబుతున్నారు. జిల్లాలో తాజా గణాంకాల ప్రకారం 3,48,945 ఖాతాల్లో కలిపి 8,62,644 ఎకరాల భూమి నమోదయింది. అటవీ, ఇతర భూములన్నీ కలిపితే జిల్లాలో భూవిస్తీర్ణం 11.11 లక్షల ఎకరాలుంటుందని తేల్చారు.
మాడ్యూల్స్ అందుబాటులోకి
నిషేధిత జాబితాలో చేరినా, ఏవైనా పొరపాట్లు దొర్లినా పట్టాదారులు వాటి పరిష్కారానికి అర్జీలు చేసుకున్నా ప్రయోజనం దక్కలేదు. ఇలాంటి వారికి ఊరట దక్కేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. సుమోటోగా కొన్ని, దరఖాస్తులతో మరికొన్నింటిని పరిష్కరిస్తున్నారు. 12 రోజుల వ్యవధిలో 44,731 సమస్యలను తీర్చారు.
అవగాహన పెంచేందుకు..
పాసుపుస్తకంలో దొర్లిన తప్పులను సవరించడం, అపరిష్కృతంగా ఉన్న పట్టామార్పిడిలు, ఫౌతీ, నిషేధిత జాబితా నుంచి తొలగించడం, న్యాయస్థానాల ఉత్తర్వుల ద్వారా పాసుపుస్తకాలు పొందడం, ఇంకా ముఖ్యమైన పొరపాట్లను సవరించేలా ఆరు మాడ్యూల్స్ ఉన్నాయి. ఏ మాడ్యూల్లో ఏ సమస్య పరిష్కారానికి మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలనే వివరాలతో తహసీల్దారు కార్యాలయాలు, మీసేవా కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు అందుబాటులో ఉంచనున్నారు.
టీఎం-33లో..: పట్టాదారు పాసుపుస్తకంలో దొర్లిన తప్పులను సవరించేందుకు గతంలో అవకాశం లేదు. ఇటీవల టీఎం-33 మాడ్యూల్ను తెచ్చారు. పట్టాదారు పేరు, తండ్రిపేరు, కులం, భూమి వర్గీకరణ, స్వభావం, భూమి పొందిన విధానం, భూవిస్తీర్ణం సవరణ, సర్వే సంఖ్య చేర్చడం, ప్రభుత్వ ఖాతా నుంచి పట్టాదారు వ్యక్తిగత ఖాతాకు మార్చడం ఇలాంటి వాటిని ఈ మాడ్యుల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. తక్షణం పరిష్కరించేలా చర్యలుంటాయని స్పష్టం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హస్త’గతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
దివ్యమైన ఓటుకు సాక్ష్యం
[ 20-04-2024]
సాక్ష్యం యాప్లో దివ్యాంగులకు అవసరమైన సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అది ఏ స్థాయిలో ఉందో ఆరా తీయవచ్చు. -
కలెక్టరేట్ కేంద్రంగా కీలక విభాగాలు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ అంటే సామాన్యమేమీ కాదు.. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.