ప్రతి క్లస్టర్ పరిధిలో ఆయిల్పామ్ సాగు
‘గత ఏడాది యాసంగితో పోల్చితే ఈసారి సాగు లక్ష్యాన్ని పెంచాం. జిల్లాలో దాదాపు 80 శాతం మేర వరి కోతలు పూర్తయ్యాయి. రైతులు కొత్తగా నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు.
యాసంగికి అందుబాటులో విత్తనాలు, ఎరువులు
‘న్యూస్టుడే’తో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్
న్యూస్టుడే, సిద్దిపేట: ‘గత ఏడాది యాసంగితో పోల్చితే ఈసారి సాగు లక్ష్యాన్ని పెంచాం. జిల్లాలో దాదాపు 80 శాతం మేర వరి కోతలు పూర్తయ్యాయి. రైతులు కొత్తగా నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయానికి తావులేకుండా పకడ్బందీగా తనిఖీలు చేస్తున్నాం. ఎవరైనా దుకాణదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్టు కింద కేసులు తప్పవు..’ అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ అన్నారు. యాసంగి (రబీ) సీజన్కి అన్నదాతలు సిద్ధమవుతున్న తరుణాన వ్యవసాయ శాఖ ప్రణాళికపై ‘న్యూస్టుడే’ మంగళవారం ముఖాముఖి నిర్వహించింది. వివిధ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ఇలా..
న్యూస్టుడే: పంటల సాగు లక్ష్యం ఏమిటి?
జిల్లా వ్యవసాయ అధికారి: వరి 3.60 లక్షల ఎకరాలు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న 20 వేల చొప్పున, శనగ 10 వేలు... వచ్చే మార్చిలోపు 15 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగును లక్ష్యంగా విధించుకున్నాం. పొద్దుతిరుగుడు, శనగ 30 వేల ఎకరాల చొప్పున, వేరుశెనగ - 5 వేల ఎకరాలకు సరిపడా విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. 6 వేల టన్నుల యూరియా, 2 వేల టన్నుల పొటాషియం, 10 వేల టన్నుల కాంప్లెక్సు నిల్వలు ఉన్నాయి. దశాబ్దాలుగా కాంప్లెక్స్, డీఏపీ వినియోగం కారణంగా బాస్వరం శాతం ఎక్కువగా ఉంది. అది కరిగించేలా పీఎస్బీని విరివిగా వాడాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
న్యూ: రైతు వేదికల నిర్వహణ తీరుపై విమర్శలు వస్తున్నాయి.. మీరేమంటారు?
జి.వ్య.అ.: ప్రతి శుక్రవారం ఏఈవోలు రైతువేదికలు సందర్శిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో వేదిక నిర్వహణకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.9 వేలు వెచ్చిస్తోంది. వ్యవసాయ శాఖ కమిషనరేట్ స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతోంది. ఆన్లైన్లో హాజరు నమోదు చేస్తున్నారు.
న్యూ: విత్తనోత్పత్తి, భూసార పరీక్షల పరిస్థితి..?
జి.వ్య.అ.: 23,500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసేలా దిశానిర్దేశం చేశాం. ఖరీఫ్లో 60 క్లస్టర్ల పరిధిలో ఒక్కో చోట 50 నమూనాల చొప్పున సేకరించాం. 15 రోజుల్లో ఫలితాలు అందించాం. ఏడాదిగా కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. ఖరీఫ్లో కలెక్టర్ అనుమతితో శాఖ నిధులతో ఈ ప్రక్రియను చేపట్టాం. సేంద్రియ సాగు ప్రోత్సహిస్తున్నాం. చేర్యాల మండలంలో దాదాపు 300 ఎకరాల్లో ఆ విధానంలో సాగు జరుగుతోంది.
న్యూ: జిల్లాలో ఆయిల్పామ్ తోటల పెంపకం తీరు..?
జి.వ్య.అ.: జిల్లాలో 127 క్లస్టర్లు ఉన్నాయి. మంత్రి హరీశ్రావు ఆదేశాలకు అనుగుణంగా ప్రతి క్లస్టర్ పరిధిలో 160 ఎకరాల మేర సాగు చేయించాలని నిర్ణయించాం. డీడీ తీయించడంతో పాటు ఉద్యాన శాఖ, ఆయిల్ఫెడ్ నుంచి రాయితీ ఇప్పించి.. మొక్కలు పెంచేలా ముందుకు సాగుతున్నాం. వచ్చే ఏడాది ముగింపులోపు 20 వేల ఎకరాల్లో పెంపకం లక్ష్యంగా విధించుకున్నాం.
న్యూ: నాసిరకం విత్తనాలు, పురుగుమందుల అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్యలు..?
జి.వ్య.అ.: నిఘా పెంచాం... జిల్లాలో 559 దుకాణాలు ఉండగా 540 నమూనాలు సేకరించాం. 13 కంపెనీలను సందర్శించాం. నాణ్యత లేని, నాసిరకం విత్తనాలు, ఉత్పత్తులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశాం. అధిక ధరలకు యూరియా, ఇతర విక్రయాలు చేపడితే చర్యలు తప్పవు. రైతులు జాగ్రత్త వహించాలి. డిసెంబరు చివరిలోపు వరి నాట్లు పూర్తి చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు