అమ్మతోడుగా.. చదువే లక్ష్యంగా!
చదవాలనే సంకల్పం ముందు వైకల్యం అడ్డుకాదని నిరూపిస్తోంది ఓ బాలిక. అమ్మ తోడుగా విద్యాభ్యాసం చేస్తోంది. సిద్దిపేట పరిధి ఇమాంబాద్కు చెందిన భార్గవి నడవలేని స్థితిలో సమస్యలను ఎదురీదుతూ ముందుకు సాగుతోంది.
భార్గవిని తరగతి గదిలోకి తీసుకువెళుతున్న తల్లి హైమావతి
న్యూస్టుడే, సిద్దిపేట: చదవాలనే సంకల్పం ముందు వైకల్యం అడ్డుకాదని నిరూపిస్తోంది ఓ బాలిక. అమ్మ తోడుగా విద్యాభ్యాసం చేస్తోంది. సిద్దిపేట పరిధి ఇమాంబాద్కు చెందిన భార్గవి నడవలేని స్థితిలో సమస్యలను ఎదురీదుతూ ముందుకు సాగుతోంది. అరుదైన కాలి ఎముకల వ్యాధి కారణంగా నడుము భాగం మొదలు కాళ్ల వరకు పీలగా మారి నడవలేని స్థితికి చేరింది. తల్లిదండ్రులు హైమావతి, చిరంజీవి.. ఒక్కగానొక్క కూతురైన ఆమెను గాజుబొమ్మగా పెంచుతున్నారు. ప్రస్తుతం సిద్దిపేటలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం (ఎంపీసీ) చదువుతోంది. నిత్యం ఆమె వెంట తల్లి తోడుగా కళాశాలకు హాజరవుతోంది. తరగతులు ముగిసే వరకు ఆవరణలో బీడీలు చుడుతోంది. ఒక తరగతి గది నుంచి మరో తరగతి గదికి, వాష్రూమ్కు వెళ్లినపుడు అక్కడే ఉండే అమ్మ ఎత్తుకొని తీసుకెళుతోంది. ఇమాంబాద్ నుంచి కళాశాలకు 5 కి.మీ. మేర నిత్యం ఆటోలో రాకపోకలు సాగిస్తున్నారు. పట్టణంలోనే ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేయగా 8.5 జీపీఏ సాధించింది.
పేదరికంలో ఉన్నా...
భార్గవి పుట్టినపుడు కాళ్లు బాగానే ఉన్నా నెలలోపు ఆమెకు అరుదైన సమస్య మొదలైంది. అంబాడే క్రమంలో ముందుకు సాగలేక నేలవాలింది. ఆసుపత్రుల్లో చూపినా పరిష్కార మార్గాన్ని పూర్తిస్థాయిలో అన్వేషించలేకపోయారు. కాలి ఎముకలపై బరువుపడితే విరిగే పరిస్థితి తలెత్తింది. అలా బాల్యంలో ఏళ్లపాటు అవస్థ పడింది. దీంతో ఆమె తల్లి ఒకటో తరగతి నుంచే వెంట వెళ్లడం మొదలైంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ముందుకు సాగింది. పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని తండ్రి చిందు, యక్షగాన కళాకారుడు. సరైన ఉపాధి లేక కూలి పనులు చేస్తున్నాడు. తల్లి బీడీలు చుడుతోంది. ప్రతి నెలా కుటుంబం గడవడానికి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. బాలికకు దివ్యాంగ పింఛను సహా వచ్చే కొద్దిపాటి ఆదాయంతో రోజులు వెళ్లదీస్తున్నారు. ఆటో కిరాయి చెల్లింపునకు ప్రతి నెలా నానా ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం ప్రణాళికతో చదువుతున్నానని, సర్కారు సాధించడమే లక్ష్యమని భార్గవి చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?