ఎట్టకేలకు నిధులు
మండల వనరుల కేంద్రాలు, పాఠశాలల సముదాయం(కాంప్లెక్స్)లకు ఎట్టకేలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
ఎమ్మార్సీ, పాఠశాలల సముదాయాలకు 50 శాతం విడుదల
సంగారెడ్డి మండల విద్యాధికారి కార్యాలయం
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: మండల వనరుల కేంద్రాలు, పాఠశాలల సముదాయం(కాంప్లెక్స్)లకు ఎట్టకేలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదున్నర నెలలైనా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో ఆయా కేంద్రాల్లో అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. ప్రతి రోజు రిపోర్టుల తయారీ, రిజిస్టర్ల నిర్వహణ, అంతర్జాల వినియోగం.. ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. వీటికి కేటాయించే సగం నిధులు ప్రస్తుతం విడుదల కావడంతో కొంత వరకు ఇబ్బందులు తీరనున్నాయి. ఎమ్మార్సీలకు రూ.8.55 లక్షలు, సముదాయ పాఠశాలల సముదాయాలకు రూ.19.12 లక్షలు కలిపి మొత్తం 27.67 లక్షలు విడుదల చేశారు. వీటిలో ఎస్సీ కాంపొనెంట్ కింద 24 శాతం, ఎస్టీ కాంపొనెంట్ కింద 14 శాతం, మిగిలిన 62 శాతం జనరల్ కాంపొనెంట్ కింద నిధులు కేటాయిస్తారు.
కొంత ఊరట: ప్రతి మండల కేంద్రంలో పాఠశాలల నిర్వహణకు మండల వనకుల కేంద్రం(మండల విద్యాధికారి కార్యాలయం) ఉంటుంది. ఇక్కడ ఆయా మండలాలకు సంబంధించిన పాఠశాలలు, ఉపాధ్యాయులకు సంబంధించిన సమాచార సేకరణ జరుగుతుంది. ప్రతి ఏడాది ఎమ్మార్సీకి రూ.90 వేల నిధులు కేటాయిస్తారు. ఈ ఏడాదికి సగం నిధులు రూ.45 వేలు వారి అకౌంట్లకు జమ చేశారు. దీనితో పాటు కాంప్లెక్స్ పాఠశాలకు ఏడాదికి రూ.45 వేలు కేటాయిస్తారు. వీరికీ 50 శాతం రూ.22,500 నికేటాయించారు. జిల్లాలో 85 కాంప్లెక్స్ పాఠశాలలకు నిలులు విడుదల చేశారు. 18 బడులను కలిపి ఓ కాంప్లెక్స్ పాఠశాలను ఏర్పాటు చేశారు. దీని పరిధిలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు తీసుకుంటారు.
కొత్త మండలాలకు మంజూరేది?
జిల్లాలో 27 మండలాలు ఉన్నాయి. వీటిలో కొత్తగా ఏర్పాటైన 8 మండలాలకు నిధులివ్వలేదు. ఈ మండలాల్లో ఎమ్మార్సీ భవనాలు లేకపోవడంతోనే నిధులు కేటాయించలేదని సమగ్ర శిక్ష అధికారులు పేర్కొంటున్నారు. అందుబాటులోని నిధులు సర్దేబాటు చేసుకోవాలని, మిగిలినవి త్వరలో మంజూరవుతాయని సెక్టోరియల్ అధికారి వెంకటేశం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.