బాల్యం.. చదువుకు దూరం
పద్నాలుగేళ్ల లోపు చిన్నారులు విధిగా పాఠశాలలకు వెళ్లాలి. విద్యతో బంగారు భవితకు బాటలు వేసుకోవాలి. ఈ నిబంధనలు చాలా చోట్ల అమలు కావడం లేదు.
ఇటుక బట్టీల వద్ద కార్మికుల పిల్లలు
ఏర్పాటు కాని పనిప్రాంత పాఠశాలలు
న్యూస్టుడే, జిన్నారం
పద్నాలుగేళ్ల లోపు చిన్నారులు విధిగా పాఠశాలలకు వెళ్లాలి. విద్యతో బంగారు భవితకు బాటలు వేసుకోవాలి. ఈ నిబంధనలు చాలా చోట్ల అమలు కావడం లేదు. ప్రధానంగా ఇటుక బట్టీల్లో పని చేసే కార్మికుల పిల్లలు బడులకు దూరంగా ఉంటుండటంతో వారికి చదువు అందడం లేదు. వీరిలో కొందరు బాల కార్మికులుగానూ మారుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఇటుక బట్టీల సీజన్ ప్రారంభమైంది. స్థానికులే కాకుండా, జిల్లాలోని ఇతర ప్రాంతాలు, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి కార్మికులు వచ్చారు. వారితో పాటు పిల్లలనూ తీసుకొచ్చారు. ఇలాంటి వారి కోసం పనిప్రాంత పాఠశాలలు ఏర్పాటు చేయాలనే నిబంధనలు ఉన్నా అమలు కాని తీరుపై కథనం.
ఉమ్మడి జిన్నారంలో అధికంగా..
ఉమ్మడి జిన్నారం మండలంలోని అన్నారం శివారులో 40 వరకు ఇటుక బట్టీలున్నాయి. ఏ బట్టీ వద్ద చూసినా చిన్నారులు కనిపిస్తున్నారు. వీరిలో కొందరు తల్లిదండ్రులకు సహకరిస్తున్నారు. ఇది చట్ట విరుద్ధమైనా పనులు తొందరగా అవుతాయని యజమానులు ప్రోత్సహిస్తున్నారు. ఇటుకలను ఆరబెట్టడం, బట్టీల వద్దకు మోయటం, ప్రమాదకరంగా ఉన్న నీటి గుంతల నుంచి జలాన్ని తరలించడం వంటి పనులు చేస్తున్నారు. ఉమ్మడి జిన్నారం మండలంలోని అన్నారం, దోమడుగు, కిష్టాయపల్లి, గడ్డపోతారం, సోలక్పల్లి, పటాన్చెరు, సంగారెడ్డి, హత్నూర, సదాశివపేట, జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో వందలాదిగా బట్టీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో 14 ఏళ్ల లోపు చిన్నారులు 5వేల మందికి పైగానే ఉంటారనే అంచనా ఉంది. ఒక్క జిన్నారం మండలంలోనే 15 వందల మంది వరకు ఇలాంటి పిల్లలున్నారు.
అధికారులు దృష్టి సారిస్తేనే..
విద్యాశాఖ ఆధ్వర్యంలో పని ప్రాంత పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఇటుక బట్టీల యజమానులు వసతి కల్పించాలి. విద్యాశాఖ విద్యార్థులకు కావాల్సిన పలకలు, పుస్తకాలు అందించాలి. వేరే రాష్ట్రాల విద్యార్థులుంటే.. ఆ భాష తెలిసినవారు.. లేదంటే ఆ రాష్ట్రం నుంచి వాలంటీర్లను రప్పించాలి. పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలి. ఈ దిశగా జిల్లా ఉన్నతాధికారులు, విద్యా శాఖాధికారులు దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు. లేదంటే పాఠశాలలకు వెళ్లాల్సిన బాలలు కార్మికులుగా మారే ప్రమాదం ఉంది.
వెంటనే ప్రారంభించేలా చర్యలు
విజయ, జిల్లా విద్యాశాఖ ఏడీ
నవంబరులోనే పని ప్రాంత పాఠశాలలు ప్రారంభించాల్సి ఉంది. ఒడిశా ప్రతినిధులుగానీ, బట్టీల యజమానులు గానీ ఈ విషయాన్ని మా దృష్టికి తేలేదు. ఎక్కడెక్కడ ఇటుక బట్టీలు ఉన్నాయి, ఎంత మంది విద్యార్థులున్నారని సర్వే చేయించి.. పాఠశాలలు ప్రారంభిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు