ప్రోత్సాహంపై ఆశ.. అందక నిరాశ!
పాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. ఇవి కేవలం మాటలకే పరిమితం కావడంతో పాడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
న్యూస్టుడే, మెదక్ టౌన్
పాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. ఇవి కేవలం మాటలకే పరిమితం కావడంతో పాడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాణా ధర విపరీతంగా పెరగడంతో, నిర్వహణ భారంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన అదనపు ప్రోత్సాహకం అందకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. దీంతో విజయ డెయిరీకి కాకుండా, ప్రైవేట్లో పాలను విక్రయిస్తున్నారు. మరికొందరు గేదెలను కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
జిల్లా కేంద్రంలో విజయ డెయిరీ ఉంది. దీని పరిధిలో చేగుంట, కౌడిపల్లి, రామాయంపేట, రేగోడ్, పెద్దశంకరంపేట, పాపన్నపేటల్లో బల్క్మిల్క్ సెంటర్లు, 155 సేకరణ కేంద్రాలున్నాయి. రైతులు ఆరువేల వరకు ఉన్నారు.వీరంతా రోజువారీగా 5,800 లీటర్ల పాలు విక్రయిస్తున్నారు. వీరికి తోడ్పాటు అందించేందుకు వెన్న శాతంతో సంబంధం లేకుండా లీటరకు రూ.4 చొప్పున 2017 సెప్టెంబరు నుంచి ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని చెల్లించింది. ధర అధికంగా రావడంతో విజయ డెయిరీ వైపు మొగ్గు చూపారు. ఎప్పుడు లేని విధంగా 2019లో కేంద్రాల నుంచి రోజుకు 12 వేల లీటర్లు వచ్చాయి. 2020 మే నుంచి ఇవ్వకపోవడంతో రూ.1.18 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఇవి ఎప్పుడు వస్తాయో స్పష్టత లేదు. దీంతో ప్రస్తుతం కేంద్రాల ద్వారా 5,800 లీటర్లు మాత్రమే డెయిరీకి వస్తున్నాయి. ఈ విషయంలో సర్కారు దృష్టి సారించకపోతే రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం
ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం విడుదల కాలేదు. 2020 మే నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా రూ.1.18 కోట్ల బకాయిలు రైతులకు చెల్లించాల్సి ఉంది. సర్కారు వారి ఖాతాలో జమ చేస్తుంది. ఎప్పుడు విడుదల అవుతాయనేది సమాచారం లేదు. పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం.
శ్రీనివాస్, డీడీ, విజయ డెయిరీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్