హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు
హత్యా నేరం రుజువు కావడంతో ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం గురువారం తీర్పు ఇచ్చిందని జహీరాబాద్ సీఐ భూపతి తెలిపారు.
కోహీర్, సంగారెడ్డి మున్సిపాలిటీ: హత్యా నేరం రుజువు కావడంతో ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం గురువారం తీర్పు ఇచ్చిందని జహీరాబాద్ సీఐ భూపతి తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు.. కోహీర్ మండలం కవేలికి చెందిన అలీముద్దీన్, సద్దాం సోదరులు. వీరిద్దరు కలిసి 2015లో చిన్న లారీ(డీసీఎం) కొనుగోలు చేసి మూడు సంవత్సరాలు సరకు రవాణా చేశారు. 2018లో సద్దాం డీసీఎంను రూ.4.5 లక్షలకు అమ్మేశాడు. ఆ మొత్తాన్ని తన వద్దే ఉంచుకుని అన్న అలీముద్దీన్కు వాటా డబ్బులు ఇవ్వలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. 2018 డిసెంబరు 6న జరిగిన గొడవలో సద్దాంను అలీముద్దీన్ కర్రతో కొడుతుండగా అదే గ్రామానికి చెందిన సైఫుద్దీన్ అడ్డు వెళ్లాడు. ఆయనకు తీవ్ర గాయమైంది. చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. సీఐ సైదేశ్వర్ విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో నిందితుడు అలీముద్దీన్కు జీవిత ఖైదుతో పాటు రూ.5వేల అపరాధ రుసుం విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి తీర్పు ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాలతో నాంది
[ 18-04-2024]
జిల్లా స్థాయిలో లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టరేట్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి -
పడిలేచిన కెరటం.. అర్పిత
[ 18-04-2024]
అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది -
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
[ 18-04-2024]
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు అవకాశాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.