వినియోగదారు గోస వినేదెప్పుడు?
కాలానికి అనుగుణంగా విద్యుత్తు పంపిణీ వ్యవస్థలో మార్పులు రాకపోవటం వినియోగదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఒక చోట విద్యుత్తు మరమ్మతులు చేయాలంటే పది చోట్ల సరఫరా నిలిపివేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
విద్యుత్తు పంపిణీ వ్యవస్థ తీరు మారక ఇక్కట్లు
న్యూస్టుడే - చేర్యాల, గజ్వేల్, ములుగు
ములుగులో తీగలను అల్లుకున్న వైనం
కాలానికి అనుగుణంగా విద్యుత్తు పంపిణీ వ్యవస్థలో మార్పులు రాకపోవటం వినియోగదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఒక చోట విద్యుత్తు మరమ్మతులు చేయాలంటే పది చోట్ల సరఫరా నిలిపివేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. పొలాల వద్ద కిందికి వేలాడుతున్న తీగలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికప్పుడు సరి చేయాల్సిన ఆ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఒకెత్తయితే.. చిన్నపాటి గాలులకే సరఫరా నిలిచిపోయి ప్రజలు చిమ్మచీకట్లో బాధలు పడుతున్నారు. సమస్యలు రాకముందు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వచ్చిన తర్వాత తంటాలు పడుతున్నారు.
ప్రత్యేక లైన్లేవి?
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియా పరిధిలో ప్రధాన రోడ్డు మీదుగా ఒకే హెచ్టీ లైన్ ఉండటంతో నియంత్రికలు కానీ, ఆ పరిధిలోని ఇళ్లకు విద్యుత్తు సరఫరాలో మరమ్మతులు చేయాల్సి ఉన్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఎల్సీ(లైన్క్లీయర్) తీసుకుంటుంటారు. లైన్ మొత్తానికి సరఫరా నిలిపివేస్తుండటంతో చాలా కాలనీలకు విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుంది. పట్టణాలకు వేర్వేరు లైన్లు ఏర్పాటు చేసి సమస్య తీర్చుతామని అధికారులు చెబుతున్నా అమలుకునోచుకోవటం లేదు. బల్దియాలో సుమారు 10 వేలకుపైగా గృహ కనెక్షన్లున్నాయి. పాతికకు పైగా నియంత్రికల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఎక్కువ కనెక్షన్లు గజ్వేల్, ప్రజ్ఞాపూర్ పరిధిలోనే ఉన్నాయి. ప్రత్యేక లైన్లు వేసి అంతరాయాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది.
చిరుగాలికే తెగుతున్న తీగలు
మండల కేంద్రమైన ములుగులో విద్యుత్తు శాఖ అధికారులు నాలుగు దశాబ్దాల కిందట 33/11 కేవీ ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఉపకేంద్రం ద్వారా ములుగుతోపాటు ఉద్యాన విశ్వవిద్యాలయం, అటవీ కళాశాల పరిశోధన, ఫలపరిశోధన కేంద్రం, కోళ్లపారంతోపాటు రెండు పడక గదుల ఇళ్లు, గురుకుల విద్యాలయం, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలు, పలు పరిశ్రమలకు అందిస్తున్నారు. ఉప కేంద్రంపై అధిక భారం పడుతోంది. కొన్నిచోట్ల తీగలు చెట్ల కొమ్మల మధ్య ఇరుక్కొని ప్రమాదకరంగా ఉన్నాయి. ములుగులో తీగలు ఏర్పాటు చేసి సుమారు నలభై ఏళ్లు కావొస్తోంది. పాతవి కావడంతో గాలులకు తెగిపోతున్నాయి. సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ములుగు మండలంలో అంతరాయం వాస్తవమేనని.. క్షేత్ర స్థాయిలో పరిశీలించి, శాశ్వత చర్యలు తీసుకుంటామని ఏఈ మహ్మద్ రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు.
ప్రతి సభలోనూ ప్రస్తావన
చేర్యాల మండల సభలో ప్రతిసారి అజెండాలో విద్యుత్తు సమస్యలు ఉండటం గమనార్హం. వేలాడుతున్న తీగల కారణంగా కొందరు రైతులు పంటలు వేయటం లేదని దొమ్మాట సర్పంచి సుభాషిణి అనేకసార్లు సభ దృష్టికి తెచ్చినా సరి చేయలేదు. చేర్యాల మండలం ఆకునూరు శివారులో నాగసముద్రం కట్ట వద్ద కేవలం ఐదు అడుగుల ఎత్తులో తీగలున్నాయని రైతు కడారి కుమార్ వాపోయారు. పొలంలో పంట సాగు చేయలేదని.. పశువులు అటువైపు మేతకు వెళ్లకుండా కాపలా ఉంటున్నామన్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఆ శాఖ పట్టణ ఏఈ టాబ్రెజ్ మాట్లాడుతూ త్వరలో సిబ్బందిని పంపించి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం