మనోధైర్యమే మకుటాయమానం
కొందరు పుట్టుకతో.. మరికొందరు ప్రమాదవశాత్తు.. అనారోగ్యంతో ఇంకొందరు.. కారణం ఏదైనా అంగవైకల్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి పలు సంస్థలు మేమున్నామంటూ అండగా నిలిచి ఆదుకుంటున్నాయి.
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, మెదక్
కొందరు పుట్టుకతో.. మరికొందరు ప్రమాదవశాత్తు.. అనారోగ్యంతో ఇంకొందరు.. కారణం ఏదైనా అంగవైకల్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి పలు సంస్థలు మేమున్నామంటూ అండగా నిలిచి ఆదుకుంటున్నాయి. కొందరు వైకల్యాన్ని లెక్క చేయక తాము అనుకున్నది చేతల్లో చూపించారు. నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కథనం.
సదరం నిర్వహణ..
ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ప్రతి నెలా సదరం శిబిరాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదరు శిబిరాలు జరుగుతున్నాయి. వైద్యులు వైకల్య శాతాన్ని పరీక్షించి ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారు. ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకునేందుకు రూ.3,016 పింఛనుగా ఇస్తోంది. సంగారెడ్డిలో 15,275, మెదక్లో 8,712, సిద్దిపేటలో 15,000, వికారాబాద్లో 13,020 మంది లబ్ధిదారులు ఉన్నారు.
చదువుకు తోడ్పాటు
జహీరాబాద్కు చెందిన వెంకటయ్య మాస్టారు.. రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఏమాత్రం కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ఎవరిపై ఆధారపకూడదని పాఠశాలను స్థాపించారు. 1984 నుంచి బడిని నడుపుతూ 20 మందికి ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించారు. పలువురు దివ్యాంగులు, తల్లిదండ్రులు లేని అనాథలకు ఉచితంగా చదివిస్తున్నారు. దివ్యాంగుడిగా సేవా భావంతో బడిని నడుతున్న వెంకటయ్య మాస్టారుకు దాత ఎకరం స్థలం బహూకరించారు. అందులో బడి నిర్మించి బోధిస్తున్నారు.
న్యూస్టుడే, జహీరాబాద్ అర్బన్
వెనుకడుగు వేయకుండా..
తాను అకున్నది సాధించేందుకు వైకల్యం అడ్డుకాదని నిరూపిస్తున్నారు చేగుంట మండలం పులిమామిడికి చెందిన చింతకింది ముత్యాలు. పుట్టుకతోనే ఎడమ కాలులో లోపం ఉండగా తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ముత్యాలు మాత్రం ఇవన్నీ కాదని తమ నాలుగున్నర ఎకరాలను నమ్ముకున్నారు. వరి సాగు చేస్తున్నారు. అన్ని పనులను స్వయంగా చేసుకుంటారు. మోపెడ్ నడిపించుకుంటూ పొలానికి వెళ్తుంటారు. రాత్రి వేళ సైతం పొలానికి వెళ్లి నీటితడులు అందిస్తుంటారు. ఇతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు. వినూత్న పద్ధతులు పాటిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.
న్యూస్టుడే, చేగుంట
బాసటగా నిలిచి..
సంగారెడ్డికి చెందిన శ్రీనివాసరాజు, సరిత దంపతులది మధ్యతరగతి కుటుంబం. తమ పెద్దబాబు మానసిక దివ్యాంగుడు. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా వృథాప్రయాసే. బాబును మానసిక దివ్యాంగుల పాఠశాలలో చేర్పించేందుకు హైదరాబాద్ వెళ్లారు. ఫీజులు భరించలేక తిరిగొచ్చారు. ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని సబిత మానసిక దివ్యాంగుల పాఠశాలను ఐదేళ్ల కిందట ప్రారంభించగా 40 మంది ఉన్నారు. శ్రీనివాసరాజు ఔట్సోర్సింగ్ పద్ధతిలో విద్యాశాఖలో పనిచేస్తుండగా సరిత పాఠశాల నిర్వహిస్తున్నారు. ఏడాది కిందట బాబు మృతిచెందడంతో వారి బాధలు వర్ణనాతీతం. మిగతా పిల్లల్లో తమ బాబును చూసుకుంటున్నామని సరిత తెలిపారు.
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్
స్వయంగా చూసుకుంటూ..
ధారూర్ మండలం గడ్డమీది గంగారం గ్రామానికి చెందిన వెల్చాల బాలయ్య.. 15 ఏళ్ల కిందట చెట్టుపై నుంచి కింద పడగా చేయి విరగ్గా.. దాన్ని తొలగించారు. తాను పెద్దగా చదువుకోకపోయినా సాగును నమ్ముకున్నారు. తమ మూడెకరాలలో వివిధ పంటలు పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. సాగు పనులన్నీ ఆయనే స్వయంగా చూసుకుంటారు. దున్నడం మొదలుకొని నీళ్లు పారించడం, మందుల పిచికారీ వరకు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. వారందరినీ ప్రయోజకులుగా తీర్చిదిద్దారు.
న్యూస్టుడే, ధారూర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెతుకు సీమకు రుణపడి ఉంటాం
[ 17-04-2024]
సంగారెడ్డి జిల్లాలో మంగళవారం నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ గులాబీ దళపతి కేసీఆర్ ప్రసంగం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కళాకారుల ఆటాపాట ఉర్రూతలూగించింది. -
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
[ 17-04-2024]
సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు మెదక్ లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. -
భారాస నియోజకవర్గ సమన్వయకర్తలు వీరే
[ 17-04-2024]
మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోని నియోజకవర్గాలకు భారాస సమన్వయకర్తలను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం ప్రకటించారు. -
జోరుగా ఉపాధి పనులు
[ 17-04-2024]
జిల్లాలో ఉపాధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సీజన్ కావడం.. వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపుతున్నారు -
సివిల్ ఫలితాల్లో మెరిసిన తండా యువతి
[ 17-04-2024]
మండలంలోని నర్సంపల్లి గ్రామపంచాయతీ పరిధి లింబియా తండాకు చెందిన కె.అర్పిత మంగళవారం వెలువడిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించి సత్తా చాటారు. -
నేతల పక్క చూపులు
[ 17-04-2024]
కొందరు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన భారాసకు నష్టం లేదు. కార్యకర్తలు మా వెంటే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి.. -
మహిళ హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు
[ 17-04-2024]
మహిళలను హతమార్చి బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించే పాత నేరస్థుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. -
త్రిముఖ పోరు.. పాగా వేసేదెవరు?
[ 17-04-2024]
గతంలో ఎన్నడూ లేని విధంగా జహీరాబాద్ లోకసభ స్థానంలో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి -
శ్రీరామ యశస్సు.. ఆచరణతో ఉషస్సు
[ 17-04-2024]
శ్రీరాముడు ప్రజలందరికీ.. ఆదర్శప్రాయుడు. సకల గుణ సంపన్నుడిగా కీర్తింపబడ్డారు. తరగని సుగుణాలతో ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నారు. రామరాజ్యం.. శ్రీరామరక్ష.. అనే పదాలు తరచూ వినిపిస్తుంటాయి. -
తాత్కాలిక ఉద్యోగాల పేరిట వల
[ 17-04-2024]
సిద్దిపేట జిల్లాలో సైబర్ నేరాలు నిత్యకృత్యంగా మారాయి. తాత్కాలిక ఉద్యోగాల పేరిట నేరగాళ్లు విసిరిన వలలో ఇద్దరు బాధితులుగా మారారు. -
అపజయాలే విజయానికి మెట్లుగా..
[ 17-04-2024]
ఉన్నత లక్ష్య సాధనకు కఠోరంగా శ్రమించాలి.. తాత్కాలిక ఆనందాలను పక్కనపెట్టాలి.. అపజయాలు లెక్క చేయక ముందుకు సాగాలి -
నిబంధనల అమలు..అడుగడుగునా తనిఖీలు
[ 17-04-2024]
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం నిఘాల ద్వారా అప్రమత్తంగా ఉంది. -
ఆ తల్లిదండ్రుల కలలు.. కల్లలు
[ 17-04-2024]
రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. అయినా వెనుకడుగు వేయకుండా ఆ తల్లిదండ్రులు కాయకష్టం చేస్తూ.. కుమారుడిని చదువులో వెన్నుతట్టి ప్రోత్సహించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్