logo

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. 20మందికి గాయాలు

మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Updated : 03 Dec 2022 17:20 IST

తూప్రాన్‌:  మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ  ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మనహోరాబాద్‌ మండలం దండుపల్లికి చెందిన నాగేందర్‌ అనే వ్యక్తి  తన ఇద్దరు పిల్లల పుట్టు వెంట్రుకలు తీయించేందుకు ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయలకు వెళ్లారు. శుక్రవారం మూడు వాహనాల్లో 40 మందికి పైగా కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి వెళ్లారు. వీరందరూ శనివారం తెల్లవారుజామున ఏడుపాయల నుంచి స్వగ్రామానికి మూడు వాహనాల్లో  బయలుదేరారు. ఈక్రమంలో మాసాయిపేట శివారులో వీరు ప్రయాణిస్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన డీసీఎం అదుపుతప్పి ఢీకొట్టింది.  దీంతో టాటా ఏస్‌ వాహనం పల్టీ కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం మాసారం గ్రామానికి చెందిన సురేష్‌(40) అక్కడికక్కడే మృతి చెందగా.. అతని ఇద్దరు  కుమార్తెలు శ్రీజ, అమ్ములతోపాటు లక్ష్మణ్‌, దండుపల్లి గ్రామానికి చెందిన నర్సమ్మ, సాలమ్మ, పోశయ్య తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తూప్రాన్‌కు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని