అమ్మకు ధీమా...!
మాతృ మరణాలు జిల్లాలో తగ్గుముఖం పట్టాయి... ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు, పౌష్టికాహారం లోపించకుండా అవగాహన, సంరక్షణ పథకాలు, ప్రత్యేక కార్యాచరణ చేపట్టడంతోనే ఇది సాధ్యమైంది.
మాతృ మరణాల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి
జిల్లాకేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం
మాతృ మరణాలు జిల్లాలో తగ్గుముఖం పట్టాయి... ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు, పౌష్టికాహారం లోపించకుండా అవగాహన, సంరక్షణ పథకాలు, ప్రత్యేక కార్యాచరణ చేపట్టడంతోనే ఇది సాధ్యమైంది. ప్రసవాల సమయంలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని జిల్లా ఆసుపత్రి వరకు ప్రత్యేక దృష్టి సారించడంతో తగ్గుతున్నాయి. మాతృ మరణాల తగ్గుదలలో ‘జాతీయ నమూనా సర్వే’లో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానం నిలిచింది. ఈ నేపథ్యంలో గర్భిణులకు అందిస్తున్న జిల్లా వైద్యారోగ్యశాఖ సేవలపై ప్రత్యేక కథనం..
పోర్టల్లో వివరాలు...
గర్భం దాల్చిన విషయం తెలిసిన వెంటనే సదరు మహిళ వివరాలను మాతాశిశు పోర్టల్లో నమోదు చేయడంలో ఆశా కార్యకర్తలు ముందుంటున్నారు. వారిని ప్రతి శుక్రవారం వైద్య పరీక్షలకు తీసుకెళ్లడం, రక్తహీనత నివారణకు పోలిక్ యాసిడ్ మాత్రలిచ్చి వేసుకునేలా చూస్తున్నారు.
కేసీఆర్ కిట్..
గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలో మూడునెలల పాటు వైద్య పరీక్షలు చేయించుకున్న వెంటనే పోషకాహారం తీసుకునేలా ఆమె వ్యకిగత ఖాతాలో మొదట రూ.3 వేలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమై ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డకు రూ.12వేలు ఇవ్వడంతో పాటు శిశు పోషణకు అవసరమైన సామగ్రితో కూడిన కేసీఆర్ కిట్ అందిస్తున్నారు.
అంగన్వాడీలు..
గర్భిణులకు ఈ కేంద్రాల్లో రోజు వారీ కోడిగుడ్లు, పప్పు దినుసులు వంటి పోషకాహారం అందిస్తున్నారు. మాతా శిశు సంరక్షణ, సుఖప్రసవానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి కేంద్రంలో న్యూట్రీగార్డెన్ ఏర్పాటు చేసి, అందులో ఆకుకూరలు, కూరగాయలను పెంచుతున్నారు.
సత్వర నమోదు నుంచి... : జిల్లాలో గత రెండేళ్లుగా మాతృ మరణాలు తగ్గుముఖం పట్టాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రుల్లో గర్భిణులకు వైద్యపరీక్షలు నిర్వహించడం, గర్భస్థ దశ నుంచి ప్రసవం వరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సంరక్షణ పథకాలు అమలు చేస్తుంది. మాతృ మరణాల నివారణకు క్షేత్రస్థాయి నుంచే ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. మాతృ మరణాల్లో ప్రధాన కారణంగా భావిస్తున్న రక్తహీనతను అధిగమించేందుకు ఐరన్ మాత్రలు అందిస్తున్నారు. హైరిస్క్ ఉన్న గర్భిణులను ముందే గుర్తించి, వారికి ప్రతి నెలా వైద్యుల పర్యవేక్షణలో సేవలు అందేలా చూడడం వంటివి మాతృమరణాల తగ్గుదలకు దోహదపడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!