కొలువులు... నిధులు ఏమయ్యాయి?
కేంద్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో కోట్లలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని... జన్ధన్ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
భాజపా వాగ్దానాలపై మంత్రి హరీశ్రావు ధ్వజం
సమావేశంలో ప్రసంగిస్తున్న హరీశ్రావు, వేదికపై ఎంపీ బీబీపాటిల్, జడ్పీ
అధ్యక్షురాలు మంజుశ్రీ, ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి తదితరులు
నిజాంపేట్(కల్హేర్), నారాయణఖేడ్, న్యూస్టుడే: కేంద్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో కోట్లలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని... జన్ధన్ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పడిన నిజాంపేట్ మండలంలో శనివారం తహసీల్దార్ కార్యాలయ ప్రారంభం, రూ.1.56 కోట్లతో పీహెచ్సీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని, జన్ధన్ ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ఏ ఒక్కరికి ఇవ్వలేదన్నారు. రైతుల బోర్లు, మోటార్ల వద్ద మీటర్లు బిగిస్తేనే రాష్ట్రానికి రావాల్సిన రూ.30 వేల కోట్లు నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం మెలిక పెట్టగా... రైతుల సంక్షేమం దృష్ట్యా ఆ నిధులు వదులుకోవడంతోపాటు 24 గంటలు విద్యుత్తు ఇచ్చి అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఖేడ్ డివిజన్కు గోదావరి జలాలు
కాలువల ద్వారా గోదావరి జలాలను నారాయణఖేడ్ డివిజన్కు తీసుకొచ్చి రైతుల పాదాలు కడిగి రుణం తీర్చుకుంటామన్నారు. గతంలో నారాయణఖేడ్ వెనుకబడిన ప్రాంతంగా ఉండేదని, తెలంగాణ ఏర్పడిన తరువాతే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా.. ఇక్కడ ఎందుకు అభివృద్ధి జరగలేదని ప్రశ్నించారు. విద్యాపరంగా గిరిజన, మైనార్టీ, సాంఘిక సంక్షేమ గురుకులాలను ఆంగ్ల మాధ్యమంలో ఏర్పాటుచేసి పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. వైద్యపరంగా ఖేడ్ ఆసుపత్రిని ఆధునికీకరించడంతోపాటు మాతాశిశు సంరక్షణ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు. కంగ్టి మండలంలోని తడ్కల్ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని జడ్పీటీసీ సభ్యుడు, సర్పంచి మంత్రికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ.పాటిల్, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ మంజుశ్రీ, అదనపు పాలనాధికారి రాజర్షిషా, ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, డీఎస్పీ బాలాజీ, ఏడీఏ కరుణాకర్రెడ్డి, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, స్థానిక సర్పంచి జగదీశ్వరాచారీ, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్